Amit Shah: అమిత్ షా బెంగాల్ పర్యటన వేళ కలకలం.. కారులో 3400 డిటోనేటర్లు..!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) నేడు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో బీర్భూమ్ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు.
కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) పర్యటన వేళ.. పశ్చిమ బెంగాల్ (West Bengal)లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. బీర్భూమ్ జిల్లాలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ కారులో 3400 డిటోనేటర్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) శుక్రవారం బీర్భూమ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ జిల్లాలోని గుస్లారా బైపాస్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ స్కార్పియో కారు అనుమానాస్పదంగా కన్పించింది. బుధవారం నుంచి ఆ వాహనం అక్కడే ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారును తనిఖీ చేయగా.. అందులో 17 బాక్సులు ఉన్నాయి. వాటిని తెరిచి చూడగా ఒక్కో బాక్సులో 200 వరకు జిలెటిన్ స్టిక్స్ (gelatin sticks) ఉన్నాయి. దీంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ను పిలిపించి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. అనంతరం కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమిత్ షా పర్యటనకు ఒక రోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
గతేడాది జులైలోనూ బీర్భూమ్ (Birbhum) జిల్లాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఓ పిక్అప్ వ్యాన్లో 81వేల డిటోనేటర్లను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. భారీ పేలుళ్లకు వారు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. ఆ దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా ఇదే ప్రాంతంలో మరోసారి పేలుడు పదార్థాలు లభ్యమవడంతో ఎన్ఐఏ దీనిపై దృష్టి సారించింది.
35+ లోక్సభ సీట్లలో మమ్మల్ని గెలిపిస్తే.. 2025లోనే దీదీ ఇంటికి!
వచ్చే లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) పశ్చిమబెంగాల్(West Bengal)లో 42 లోక్సభ సీట్లకు గానూ 35కు పైగా సీట్లలో భాజపాను గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) విజ్ఞప్తి చేశారు. ఈ లక్ష్యాన్ని తాము సాధిస్తే.. 2025 తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీ సర్కార్కు ఇంకా 2026 మే వరకు గడువు ఉన్న నేపథ్యంలో బీర్బుమ్ జిల్లా పర్యటనలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల రాష్ట్రంలోని పలుచోట్ల శ్రీరామ నవమి ర్యాలీల్లో తలెత్తిన ఘర్షణల అంశాన్ని ప్రస్తావించిన అమిత్ షా.. మమతా బెనర్జీ హిట్లర్ తరహా పాలనను నడుపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బెంగాల్లో 35 సీట్లకు పైగా సాధించి కేంద్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే శ్రీరామనవమి ర్యాలీలపై దాడి చేయడానికి ఎవరూ సాహసం చేయరన్నారు.
ప్రస్తుతం ఎంపీగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎంని చేయాలని మమతా బెనర్జీ కలలు కంటున్నారని అమిత్ షా అన్నారు. కానీ, బెంగాల్తో తదుపరి సీఎం భాజపా నుంచే అవుతారని వ్యాఖ్యానించారు. అవినీతి తృణమూల్ కాంగ్రెస్పై పోరాడేది, ఓడించేది ఒక్క భాజపా మాత్రమేనన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో భాజపా 18 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగవిరుద్ధమని మండిపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు