Pakistan: మైనారిటీలపై అత్యాచారాలు నిత్యకృత్యం!
పాకిస్థాన్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్కడ బలవంతపు మత మార్పిడులు రోజువారీగా జరిగే ఘటనలని పేర్కొంది.
ఐరాసలో పాక్ తీరును ఎండగట్టిన భారత్
జెనీవా: పాకిస్థాన్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్కడ బలవంతపు మత మార్పిడులు రోజువారీ ఘటనలని పేర్కొంది. ప్రతి ఏటా వేల మంది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల ఘటనలపై పాక్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి సమావేశాల్లో కశ్మీర్ సమస్యను పాకిస్థాన్ లేవనెత్తడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై దాయాది అకృత్యాలను మరోసారి ఎండగట్టింది.
‘పాకిస్థాన్లో కొన్ని అల్పసంఖ్యాక మతాలకు చెందినవారిని బలవంతపు మత మార్పిడులు చేయిస్తుండటం నిత్యకృత్యం. మైనర్ అమ్మాయిలను అపహరించడం, అత్యాచారాలు, దౌర్జన్యపూరిత వివాహాలు జరుగుతూనే ఉంటాయి. వీటిని అడ్డుకునే వారిపై హింసకు పాల్పడే ఘటనలకు అడ్డూ అదుపు ఉండదు. పవిత్ర ప్రార్థనాలయాలపై దాడులు, ధ్వంసం చేసే ఘటనలు ఎక్కువయ్యాయి’ అని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (UNHRC) 47వ సమావేశాల్లో భాగంగా భారత శాశ్వత కమిషన్ కార్యదర్శి పవన్ బదే పేర్కొన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వంతపాడుతూ.. వారిని ఆర్థికంగా ఆదుకునే విధానాలకు మద్దతు పలుకుతోన్న పాకిస్థాన్ను జవాబుదారీ చేయాలని ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది.
ఇక పాకిస్థాన్లో జరుగుతోన్న అత్యాచారాలకు అక్కడి మహిళల వస్త్రధారణ ఓ కారణమని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిలు రెచ్చగొట్టే రీతిలో పొట్టి దుస్తులు వేసుకుంటే అబ్బాయిలపై ప్రభావం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘కురచ బట్టలు వేసుకునే అమ్మాయిలను చూస్తే అబ్బాయిలపై ప్రభావం పడకుండా ఉండదు.. వారు రోబోలైతే తప్ప! అలాంటి వస్త్రాలు ధరించకపోవడం ద్వారా లైంగిక దాడుల్ని నివారించవచ్చు. రెచ్చగొట్టే వైఖరిని నివారించాలంటే పర్దాలు ధరించాలి’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను పాకిస్థాన్ ముస్లిం లీగ్ తీవ్రంగా ఖండించడంతో పాటు అంతర్జాతీయంగా మహిళా సంఘాలు ఇమ్రాన్ వ్యాఖ్యలపై మండిపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. -
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
ఇజ్రాయెల్, ఇరాన్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని, ఆ దేశాలకు ప్రయాణించేటప్పుడు భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. -
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
లోక్సభ ఎన్నికల వేళ.. ఒడిశాకు చెందిన ఒక ఉన్నతాధికారిణిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
దేశ రాజధానిలో ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. -
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
పశ్చిమ్ బెంగాల్ గవర్నర్పై ఒక యువతి చేసిన ఆరోపణలపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా మండిపడ్డారు. -
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా