Karnataka: ఉచిత బియ్యం బదులు డబ్బులు.. కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం
కర్ణాటక (Karnataka)లో బియ్యం కొరత కారణంగా అన్నభాగ్య పథకం అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం బియ్యం బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది.
బెంగళూరు: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ (Congress) ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం (Anna Bhagya scheme) అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పథకాన్ని జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా.. అందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావట్లేదు. దీంతో సిద్ధరామయ్య (Siddaramaiah) సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రకటించింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి (Ration Rice) సమానమైన డబ్బును బీపీఎల్ ఖాతాదారుల (BPL card holders) బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ భేటీ నిర్ణయాలను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప మీడియాకు వెల్లడించారు. ‘‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ప్రకారం కిలో బియ్యానికి ప్రామాణిక ధర రూ.34గా ఉంది. బీపీఎల్(దారిద్ర్య రేఖకు దిగువన్న ఉన్నవారు) ఖాతాదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు మేం విశ్వప్రయత్నాలు చేశాం. కానీ మన రాష్ట్రానికి అవసరమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఏ సంస్థా ముందుకు రావట్లేదు. ఇక, అన్నభాగ్య పథకాన్ని జులై 1 నుంచి ప్రారంభించాల్సి ఉంది. బియ్యం కొరత కారణంగా పథకం అమలును ఆపలేం. అందుకే అందుకు సమానమైన డబ్బులను ఇవ్వనున్నాం. బియ్యం అందుబాటులోకి వచ్చేవరకు.. కిలో బియ్యానికి రూ.34 చొప్పున నగదును అందిస్తాం. జులై 1 నుంచి ఈ నగదు నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తి ఉంటే నెలకు రూ.170 వస్తాయి. అదే ఇద్దరు వ్యక్తులైతే రూ.340, ఐదుగురు కుటుంబసభ్యులుంటే నెలకు రూ.850 జమ చేస్తాం’’ అని మంత్రి వివరించారు.
అన్నభాగ్య పథకం కుటుంబంలో ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే కేంద్రం అందిస్తున్న 5 కిలోల బియ్యానికి ఇది అదనం. అయితే ఇందుకు అవసరమైన ధాన్యం సేకరణ విషయంలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అన్నభాగ్య పథకం (Anna Bhagya scheme) అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు నిరాకరిస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. బియ్యం ఇస్తామని తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. దీంతో ఎన్నికల హామీలను అమలు చేయడంలో సిద్ధూ సర్కారు విఫలమైందంటూ భాజపా నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?