కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Updated : 24 Sep 2022 17:06 IST

దిల్లీ: కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూజలు నిర్వహించారు. కేంద్రంలో నరేంద్రమోదీ కేబినెట్‌లో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 25 నెలల ఏడు రోజుల వ్యవధిలోనే కిషన్‌రెడ్డి పదోన్నతి పొందారు. తెలంగాణ ఆవిర్భవించాక కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి కేబినెట్‌ హోదా దక్కించుకున్న తొలి నేతగా గుర్తింపు పొందారు. గంగాపురం కిషన్‌రెడ్డి ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయం సాధించారు. 2019లో సికింద్రాబాద్‌ ఎంపీగా గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురంలో సామాన్య రైతు కుటుంబంలో 1960లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ.. అంచెలంచెలుగా ఎదిగారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యాటక శాఖ లక్ష్యాలు చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తానన్నారు. ‘‘ పర్యటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. అధికారులతో సమీక్షించాక ప్రధాని దిశానిర్దేశంతో ముందుకెళ్తాం. విశేషమైన 3 శాఖలు ప్రధాని మోదీ నాకు అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని