Lalu Prasad: లాలూ కిడ్నీ మార్పిడి విజయవంతం.. తండ్రికి అవయవ దానం చేసిన తనయ
ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స పూర్తయ్యింది. లాలూ రెండో కుమార్తె రోహిణి ఆయనకు అవయవ దానం చేశారు. సింగపూర్లో ఈ సర్జరీ విజయవంతమైందని, వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని లాలూ తనయుడు తేజస్వి యాదవ్ వెల్లడించారు.
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. లాలూ కుమార్తె రోహిణి అర్చన ఆయనకు కిడ్నీ దానం చేశారు. సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో సోమవారం ఈ శస్త్రచికిత్స పూర్తయ్యింది. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని లాలూ తనయుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వెల్లడించారు. లాలూను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు తరలిస్తున్న వీడియో ట్వీట్ చేసిన ఆయన.. తమ కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతోకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పరీక్షించిన వైద్యులు కిడ్నీ మార్పిడి (Kidney Transplant) అనివార్యమని సూచించారు. దీంతో తన కిడ్నీని నాన్నకు ఇస్తానంటూ సింగపూర్లో ఉంటున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ముందుకొచ్చారు. ‘నా తల్లిదండ్రులే నాకు దేవుళ్లు. వారికోసం ఏదైనా చేస్తా’ అంటూ చెప్పిన ఆమె.. కిడ్నీ అనేది తన శరీరంలోని ఓ చిన్న ముక్క మాత్రమే అని పేర్కొన్నారు. తాజాగా సర్జరీ జరిగే కొన్ని నిమిషాల ముందు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తమకు గుడ్లక్ చెప్పండంటూ తండ్రితో కూర్చున్న ఓ ఫొటో పోస్టు చేశారు.
ఇదిలాఉంటే, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణానికి (Fodder Scam) సంబంధించిన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అనారోగ్య కారణాలతో ఇటీవలే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సింగపూర్కు వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందిన ఆయన.. కుమార్తె కిడ్నీ దానంతో శస్త్రచికిత్స జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా