వారు నియంతల్లా వ్యవహరిస్తున్నారు: మమత
భాజపా నాయకత్వాన్ని నియంతలు అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలినీలతో పోల్చుతూ వారిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడిని వారే ఆడిన నాటకంగా ఆమె అభిప్రాయపడ్డారు.
కోల్కతా: భాజపా నాయకత్వాన్ని నియంతలు అడాల్ఫ్ హిట్లర్, ముస్సోలినీలతో పోల్చుతూ పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడిని వారే ఆడిన నాటకంగా ఆమె వర్ణించారు. ఈ మేరకు తమ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
‘రాష్ట్రానికి బయటి నుంచి కొందరు వ్యక్తులు వచ్చి మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. భాజపా నాయకులు హిట్లర్, ముస్సోలినీ తరహాలో నియంతల్లా వ్యవహరిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలకు, రాజ్యాంగానికి కట్టుబడి లేదు. రాష్ట్రాల అధికార పరిధిని కేంద్రం ఆక్రమిస్తోంది. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 400 మంది ఎంపీల బలం ఉన్నా అలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ భాజపా 300 ఎంపీల బలంతో చట్టాలను చేతిలోకి తీసుకుని సామాన్య మానవుడిని ఇబ్బందులకు గురిచేస్తోంది. కేంద్రం ఇప్పుడు ఆంఫన్ తుఫాన్ సహాయ నిధి గురించి మా ప్రభుత్వాన్ని అకౌంట్స్ అడుగుతోంది. ముందు పీఎం కేర్స్ నిధులు ఏమవుతున్నాయో వారు చెప్పాలి. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. రైతుల కోసం ప్రజలంతా ఐక్యతగా ఉండాలి. భాజపా నాయకులు వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఉద్యమాలను చేస్తే అణచివేయడానికి పథకం సిద్ధం చేసుకున్నారు. అందులోభాగంగానే రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు ’ అని మమతా బెనర్జీ భాజపాపై విమర్శలు చేశారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు. -
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓ యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్