Job Vacancies: కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 14,600 అధ్యాపక పోస్టులు ఖాళీ
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 14వేలకు పైగా ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.
దిల్లీ: కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఉన్నత విద్యా సంస్థల్లో భారీగా అధ్యాపక పోస్టుల ఖాళీలు(faculty job vacancy) ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్సభ(Lok Sabha)లో వెల్లడించింది. మొత్తంగా 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని విద్యా సంస్థల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు. విద్యాశాఖ పరిధిలోని ఉన్నత విద్యా సంస్థల్లో 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఇప్పటివరకు 6వేల అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల్ని భర్తీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లోనే కొందరు పదవీ విరమణ చేయడం, మరికొందరు రాజీనామాలు చేయడానికి తోడు విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో అదనపు అవసరాల రీత్యా ఈ పోస్టుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయని వివరించారు. విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఆయా విద్యా సంస్థలు తగిన చర్యలను తీసుకుంటున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!