అంబానీ ఇంటి వద్ద వాహనం కేసులో కీలక మలుపు
దక్షిణ ముంబయిలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్థాలున్న వాహనం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
పేలుడు పదార్థాలున్న స్కార్పియో యజమాని ఆత్మహత్య
ముంబయి: దక్షిణ ముంబయిలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్థాలున్న వాహనం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్టు ఠానే పోలీసులు వెల్లడించారు. పేలుడు పదార్థాలున్న వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ మృతదేహం శుక్రవారం ముంబయికి సమీపంలోని ఓ వాగులో గుర్తించినట్లు తెలిపారు. ఆయన ఓ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 25న జిలెటిన్ స్టిక్స్తో ఉన్న ఓ స్కార్పియో ఎస్యూవీ వాహనాన్ని అంబానీ ఇంటికి సమీపంలో పోలీసులు గుర్తించారు. ఆ వాహనం విక్రోలీలో నివసించే మన్సుఖ్ హిరెన్కు చెందిందని పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. ఆ వాహనంలో నీతా అంబానీకి రాసిన ఓ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం అంతకుముందే చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ వాహనాన్ని తామే ముకేశ్ అంబానీ నివాసం వద్ద ఉంచినట్లు జైష్- ఉల్- హింద్ సంస్థ ప్రకటించుకుంది. కానీ ఈ ఘటనతో ఆ సంస్థకు సంబంధంలేదని పోలీసులు స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్