Paan: ‘పేష్వాయీ గోల్డ్‌ పాన్‌’ రుచి చూడాలంటే.. రూ.లక్ష చెల్లించాల్సిందే!

మహారాష్ట్రలోని ఓ పాన్‌ షాప్‌లో దాదాపు 600 రకాల పాన్‌లను అమ్ముతున్నారు. గత ఎనిమిదేళ్లుగా నడుస్తున్న ఈ పాన్‌ షాప్‌ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Published : 04 Mar 2023 07:18 IST

మహారాష్ట్రలోని ఓ పాన్‌ షాప్‌లో దాదాపు 600 రకాల పాన్‌లను అమ్ముతున్నారు. గత ఎనిమిదేళ్లుగా నడుస్తున్న ఈ పాన్‌ షాప్‌ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో రూ.25 నుంచి రూ.లక్ష వరకూ ధర ఉన్న పాన్‌లను విక్రయిస్తున్నారు. నాసిక్‌ పమీపంలో ఉన్న ఆ దుకాణం పేరు మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్‌. దీన్ని గణేశ్‌ దుక్రే అనే యువకుడు ప్రారంభించాడు. డిగ్రీ పూర్తి చేసిన గణేశ్‌కు ఉద్యోగం దొరక్కపోవడంతో తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. తొలుత పుణె వెళ్లి ఓ పాన్‌ షాప్‌లో పనిచేశాడు. అక్కడ వివిధ ఆకులు, పాన్‌ల గురించి తెలుసుకున్నాడు. అనంతరం నాసిక్‌ వచ్చి పాన్‌ షాప్‌ ప్రారంభించాడు.  ఇక్కడ పేష్వాయీ గోల్డ్‌ పాన్‌ రుచి చూడాలంటే సుమారు రూ.లక్ష చెల్లించాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని