‘పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న మోదీ’
భారత ప్రధాని నరేంద్ర మోదీ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్)’ అనే అంతర్జాతీయ సంస్థ ఆరోపించింది. మీడియా అండతో ఆయన తన సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం
తన సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు : ఆర్ఎస్ఎఫ్
కిమ్జోంగ్ ఉన్, ఇమ్రాన్ఖాన్లూ అదే జాబితాలో..
దిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ఎస్ఎఫ్)’ అనే అంతర్జాతీయ సంస్థ ఆరోపించింది. మీడియా అండతో ఆయన తన సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న నేతల పేర్లతో ఆర్ఎస్ఎఫ్ ఓ జాబితాను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా 37 మంది దేశాధినేతలు/ప్రభుత్వాధినేతలకు అందులో చోటుకల్పించింది. మోదీతో పాటు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, మయన్మార్ మిలటరీ అధ్యక్షుడు మిన్ ఆంగ్ లయాంగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
ఇందులో ఇద్దరు మహిళలు (బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్) కూడా ఉన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న నేతల జాబితాను ఈ సంస్థ ప్రచురించడం 2016 తర్వాత ఇదే తొలిసారి. 2001లో మొదటిసారిగా దీన్ని ప్రచురించారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సద్, ఇరాన్కు చెందిన అలీ ఖమేనీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బెలారస్కు చెందిన అలెగ్జాండర్ లుకషెంకో తొలి నుంచీ ఈ జాబితాలో కొనసాగుతున్నారు. 2021కి సంబంధించి 180 దేశాలతో ఆర్ఎస్ఎఫ్ రూపొందించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండటం గమనార్హం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్