అంబేడ్కర్ ఆలోచనలు ఎందరికో స్ఫూర్తి: రాష్ట్రపతి
సమాజంలో అసమానతలు తొలగించేందుకు భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్ జీవితకాల కృషి చేశారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొనియాడారు.
దిల్లీ: సమాజంలో అసమానతలు తొలగించేందుకు భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్ జీవితకాలం కృషి చేశారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొనియాడారు. నేడు అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఆయనకు ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. ‘భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేడ్కర్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఆయన జీవితకాల పోరాటం చేశారు. ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని మన జీవితంలో మార్పులకు సంకల్పించాలి’ అని రాష్ట్రపతి ట్వీట్లో వెల్లడించారు.
‘భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి తరానికి ఉదాహరణగా నిలుస్తుంది’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్