Jallikattu: ‘జల్లికట్టు’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జల్లికట్టు (Jallikattu) నిర్వహణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఆ క్రీడ నిర్వహణ కోసం తమిళనాడు రూపొందించిన చట్టాన్ని కోర్టు సమర్థించింది.
దిల్లీ: తమిళనాడు (Tamil Nadu) సంప్రదాయ క్రీడ జల్లికట్టు (Jallikattu) విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. జల్లికట్టుపై తమిళనాడు చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జంతు హింస చట్టం ఈ ఆటకు వర్తించదని తెలిపింది. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. తమిళ సంస్కృతిలో జల్లికట్టు ఓ భాగమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది.
తమిళనాడులో పొంగల్ పండగ సమయంలో ఈ జల్లికట్టు ఆటను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఈ క్రీడపై గతంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. ఈ క్రీడ జంతువులపై హింస నివారణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని అప్పట్లో కోర్టు పేర్కొంది. అయితే, ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే జల్లికట్టును ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టం నుంచి తొలగిస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం 2017లో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకు అనుకూలంగా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టానికి సవరణలు చేస్తూ కొత్త యాక్ట్ తీసుకొచ్చింది.
అయితే, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 1960 నాటి జంతు హింస నివారణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఈ చట్టం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీని వల్ల జంతువులు, మనుషులు గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని, హింసతో కూడిన ఈ ఆటను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గతేడాది విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రానా దాన్ని నెత్తుటి క్రీడ అనలేమని పేర్కొంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.
తాజాగా సర్వోన్నత న్యాయస్థానం దీనిపై తీర్పు వెలువరించింది. జల్లికట్టుపై తమిళనాడు చేసిన చట్టాన్ని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. ‘‘గత శతాబ్ద కాలంగా తమిళనాడులో జల్లికట్టును నిర్వహిస్తున్నారు. ఇది ఆ రాష్ట్ర సంస్కృతిలో భాగమా? కాదా? అన్నదానిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోదు. అది తమ వారసత్వ సంస్కృతిలో భాగమని శాసనసభ నిర్ణయించినప్పుడు.. న్యాయవ్యవస్థ దాన్ని భిన్నకోణంలో చూడలేదు. దీనిపై శాసనసభ నిర్ణయం తీసుకోవడమే మంచిది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఇలాంటి క్రీడలను అనుమతిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలను కూడా సుప్రీంకోర్టు సమర్థించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ