Pig kidney to human: మనిషికి పంది కిడ్నీ.. ఆపరేషన్ సక్సెస్
వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి తాత్కాలికంగా
న్యూయార్క్: వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగానే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అవయవమార్పిడి సర్వ సాధారణమే అయినప్పటికీ.. అవయవాల కొరత వేధిస్తోంది. ఇందుకు పరిష్కారం కనుగొనే దిశగా శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనషులకు అమర్చే అంశంపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూయార్క్లోని ఎన్వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన రోగికి పంది కిడ్నీ అమర్చాలని నిర్ణయించారు. ఇందుకు ఆ రోగి బంధువులు కూడా అంగీకరించడంతో గత నెల ఆపరేషన్ నిర్వహించారు. పంది కిడ్నీని రోగి శరీరానికి అమర్చి మూడు రోజల పాటు పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని సర్జన్ డా. రాబర్డ్ మోంట్గోమెరి తెలిపారు.
అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనే క్రమంలో గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పందుల అవయవాలపై దృష్టి పెట్టారు. అయితే దీంట్లో కొన్ని సమస్యలున్నాయి. పంది కణాల్లోని గ్లూకోజ్ మనిషి శరీర వ్యవస్థకు ఇది సరిపోలడం లేదు. దీంతో ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి తిరస్కరణకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చేసిన ప్రయోగంలో జన్యు సవరణ చేసిన పంది నుంచి అవయవాన్ని సేకరించారు. పంది కణాల్లో చక్కెర స్థాయిలను తొలగించి, రోగ నిరోధక వ్యవస్థకు దాడిని నివారించేలా జన్యువుల్లో మార్పులు చేశారు. జన్యు పరంగా మార్పులు చేసిన పందులను గాల్సేఫ్గా పిలుస్తారు. గాల్సేఫ్లను మాంసం అలర్జీ ఉన్నవారికి ఆహారంగానూ, మానవ చికిత్సలో వనరులుగా వినియోగిస్తున్నారు. వీటికి అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2020లో ఆమోదం తెలిపింది.
ఈ ప్రయోగం విజయవంతమైందని, అవయవ మార్పిడిలో కీలకమైన ముందడుగని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అవయవాల కొరత ఉంది. ఒక్క అమెరికాలోనే లక్ష మందికి పైగా అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తుండగా.. వీరిలో 90వేల మందికి పైగా కిడ్నీ సమస్య బాధితులే. అమెరికా నెట్వర్క్ ఫర్ ఆర్గాన్ షేరింగ్ ప్రకారం.. ఒక మనిషికి కిడ్నీ దొరకేందుకు సగటున మూడు నుంచి ఐదేళ్లు పడుతుందట. దీంతో శాస్త్రవేత్తలు జంతువుల నుంచి అవయవాలను సేకరించి మనిషులకు అమర్చే అంశంపై విస్తృతంగా ప్రయోగాలు జరుపుతున్నారు.
నిజానికి జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే అంశంపై 17వ శతాబ్దం నుంచే ప్రయోగాలు జరుగుతున్నాయి. 20వ శతాబ్దంలో కొందరు శాస్త్రవేత్తలు బబూన్(ఒకరకమైన కొండముచ్చు) గుండెను ఓ చిన్నారికి అమర్చి 21 రోజుల పాటు జీవించేలా చేశారు. ఇలాంటి ప్రయోగాలు విజయవంతమైతే.. అవయవాలు దొరికే వరకు తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు జంతువుల అవయవాలను అమర్చి మనుషుల ప్రాణాలు బతికించొచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్