Afghanistan: తాలిబన్లే లక్ష్యంగా పేలుళ్లు.. ముగ్గురి మృతి

అఫ్గాన్‌లో తాలిబన్లకు ఊహించని పరిణామం! వారి వాహనాలను లక్ష్యంగా చేసుకుని శనివారం వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. నంగర్‌హార్‌ ప్రావిన్స్‌ రాజధాని జలాలాబాద్‌లో ఈ దాడి చోటుచేసుకుంది...

Updated : 18 Sep 2021 18:54 IST

కాబుల్‌: అఫ్గాన్‌లో తాలిబన్లకు ఊహించని పరిణామం! వారి వాహనాలను లక్ష్యంగా చేసుకుని శనివారం వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. నంగర్‌హార్‌ ప్రావిన్స్‌ రాజధాని జలాలాబాద్‌లో ఈ దాడి చోటుచేసుకుంది. రోడ్డు పక్కన అమర్చిన మందు పాతరలు పేలడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు ఓ వార్తసంస్థకు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు తాలిబన్లు ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయంపై స్పష్టత రాలేదు. మరోవైపు 20 మంది క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పౌరులే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఈ పేలుళ్లకు ఇంతవరకు ఎవరూ బాధ్యత వహించలేదు. మరోవైపు కాబుల్‌లోనూ ఓ బాంబు పేలి, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై కూడా పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు అఫ్గాన్‌ను ఓ కంట కనిపెడ్తున్న తరుణంలో తరుణంలో ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికా సైన్యాల ఉపసంహరణ, పౌరుల తరలింపు సమయంలోనూ కాబుల్‌ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్లు సంభవించి, భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని