Mu, C.1.2 Variants: భారత్లో ఈ వేరియంట్ల జాడల్లేవ్..!
ప్రమాదకరంగా భావిస్తోన్న Mu, C.1.2 రకాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకు ఈ రెండు రకాలు భారత్లో వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన కన్సార్టియం INSACOG వెల్లడించింది.
జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం వెల్లడి
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రమాదకరంగా భావిస్తోన్న Mu, C.1.2 రకాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇప్పటివరకూ ఈ రెండు రకాలు భారత్లో వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన జీనోమ్ కన్సార్టియం INSACOG వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఆందోళనకరమైన డెల్టా వేరియంట్తోపాటు దాని ఉపరకాల ప్రభావమే అధికంగా ఉందని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన C.1.2 రకం మనదేశంలో బయటపడనప్పటికీ అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్ సోకిన వారికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టేందుకు ఇప్పటికే ఉన్న సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని INSACOG స్పష్టం చేసింది.
ఆ రెండు దేశాల్లోనే ఎక్కువ..!
ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా బయటపడుతున్న కరోనా వేరియంట్ల తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వాటి సంక్రమణ రేటు, తీవ్రత ఆధారంగా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (VOI), వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VOC)గా ప్రకటిస్తోంది. ఈ మధ్య కొత్తగా వెలుగు చూసిన Mu (B.1.621)తో పాటు C.1.2లను ప్రస్తుతానికి ఆందోళనకరం కాని (VOI) వేరియంట్లుగానే ప్రకటించింది. అయితే, Mu ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా తక్కువే ఉందని.. ప్రస్తుతం వీటి తీవ్రత 0.1శాతానికి తగ్గినట్లు పేర్కొంది. అత్యధికంగా కొలంబియాలో 39శాతం, ఈక్వెడార్లో 13శాతం కేసుల్లో వీటి ప్రభావం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ గుర్తించిన ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే కొత్తగా వెలుగు చూసిన C.1.2 రకం ఎన్నో ఎక్కువ మ్యుటేషన్లకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగానే వీటి మ్యుటేషన్లో పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇతర రకాల మ్యుటేషన్ రేటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో (ఏడాదికి 41.8 మ్యుటేషన్లు) మార్పులు చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. యాంటీబాడీలను తప్పించుకునే గుణం కూడా C.1.2 సీక్వెన్సుల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక వీటికితోడు టీకాల వల్ల వచ్చే యాంటీబాడీలను ఏమార్చే గుణం మరో ప్రమాదకరమైన Mu రకానికి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, వీటి ప్రాబల్యం, తీవ్రతపై పరిశోధనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వీటిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గానే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. -
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
ఇజ్రాయెల్, ఇరాన్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని, ఆ దేశాలకు ప్రయాణించేటప్పుడు భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. -
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
లోక్సభ ఎన్నికల వేళ.. ఒడిశాకు చెందిన ఒక ఉన్నతాధికారిణిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
దేశ రాజధానిలో ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. -
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
పశ్చిమ్ బెంగాల్ గవర్నర్పై ఒక యువతి చేసిన ఆరోపణలపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా మండిపడ్డారు. -
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM