Cruise ship incident: ఆర్యన్ను ఇరికించేందుకే అక్కడకు పిలిచారు..!
డ్రగ్స్ కేసు వ్యవహారంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వైఖరిని తప్పుపడుతూ కొన్ని దృశ్యాలను శనివారం విడుదల చేశారు.
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు
ఆ ముగ్గుర్ని ఎన్సీబీ ఎందుకు విడుదల చేసిందని ప్రశ్నించిన మంత్రి
ముంబయి: డ్రగ్స్ కేసు వ్యవహారంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వైఖరిని తప్పుపడుతూ కొన్ని దృశ్యాలను శనివారం విడుదల చేశారు. గతవారం ముంబయి తీర ప్రాంతంలో క్రూజ్ నౌకలో పట్టుబడిన ఓ భాజపా నేత బంధువును ఎన్సీబీ వదిలేసిందని సాక్ష్యాలతో సహా ఆరోపణలు చేశారు. భాజపా నేత మోహిత్ కాంబోజ్ బంధువు రిషబ్ సచ్దేవ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వెంటనే విడుదలయ్యారని నవాబ్ మాలిక్ మీడియాకు వెల్లడించారు. రిషబ్తో కలిపి ముగ్గురు వ్యక్తులను ఎన్సీబీ విడుదల చేసిందన్నారు. మోహిత్ గతంలో ముంబయి భాజపా యువ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేశారు.
‘డ్రగ్స్ కేసులో నిర్బంధించిన వ్యక్తుల గురించి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే అస్పష్టమైన ప్రకటన చేశారు. 8-10 మంది వరకు అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే రాష్ట్ర పోలీసులు ఈ వ్యవహారంపై ఒక కన్నేసి ఉంచారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ సంఖ్య పదకొండు. తెల్లారి ఆ సంఖ్య ఎనిమిదికి తగ్గింది. ముగ్గుర్ని వదిలేశారు’ అంటూ నవాబ్ మాలిక్ విమర్శించారు. రిషబ్ సహ మరో ఇద్దరు వ్యక్తులు ఎన్సీబీ కార్యాలయంలోకి వెళ్లిన దృశ్యాలను మంత్రి మీడియాకు చూపించారు. అలాగే మోహిత్తో రిషబ్ దిగిన ఫొటోలను కూడా బయటపెట్టారు. నవాబ్ మాలిక్ కార్యాలయం దానికి సంబంధించిన చిత్రాన్ని ట్వీట్ చేసింది.
‘రిషబ్, ప్రతీక్ గబా, ఆమిర్ ఫర్నీచర్వాలా విడుదల కోసం రాష్ట్రం, దిల్లీకి చెందిన భాజపా నేతలు ఫోన్లు చేశారని మాకు అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. వాంఖడే వారిని ఎందుకు వదిలేశారో చెప్పాలి. వారిని వదిలేసేముందు ఎలాటి విచారణ జరిగింది?’ అని మంత్రి ప్రశ్నించారు. కొంతమందిని ఇరికించే ప్లాన్తోనే క్రూజ్ నౌకపై ఎన్సీబీ దాడి జరిగిందని విమర్శించారు. ‘ఇది పూర్తిగా నకిలీ దాడి. ఆర్యన్ ఖాన్ వద్ద ఏమీ గుర్తించలేదు. ఆర్యన్ను ఇరికించడానికి ప్రతీక్, ఆమిర్ అతడిని అక్కడకు రప్పించారు. వారిద్దరి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లాడు’ అని వెల్లడించారు. సొంత అజెండా కోసం భాజపా ఎన్సీబీని ఉపయోగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం మహారాష్ట్ర, బాలీవుడ్ పరువు తీయడం కిందికే వస్తుంది’ అంటూ ఆయన కార్యాలయం మరో ట్వీట్ చేసింది.
ముంబయి నుంచి గోవాకు వెళ్తున్న క్రూజ్ నౌకలో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న అభియోగంపై బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా పలువురిని గతవారం ఎన్సీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి కోర్టు బెయిల్ నిరాకరించడంతో ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. -
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
ఇజ్రాయెల్, ఇరాన్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని, ఆ దేశాలకు ప్రయాణించేటప్పుడు భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. -
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
లోక్సభ ఎన్నికల వేళ.. ఒడిశాకు చెందిన ఒక ఉన్నతాధికారిణిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
దేశ రాజధానిలో ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. -
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
పశ్చిమ్ బెంగాల్ గవర్నర్పై ఒక యువతి చేసిన ఆరోపణలపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా మండిపడ్డారు. -
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM