Vaccine: టీకా తీసుకుంటే.. స్మార్ట్ఫోన్ ఫ్రీ
కరోనా కట్టడిలో భాగంగా గుజరాత్లోని రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న
గాంధీనగర్: కరోనా కట్టడిలో భాగంగా గుజరాత్లోని రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో డోసు టీకా తీసుకోనివారే లక్ష్యంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. డిసెంబరు 4 నుంచి 10 మధ్య రెండో డోసు తీసుకున్న లబ్ధిదారులకు స్మార్ట్ఫోన్ అందించనున్నట్లు ప్రకటించింది.
డ్రా నిర్వహించి ఒక లక్కీ విన్నర్ను ఎంపిక చేయనున్నట్లు రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమిత్ అరోడా తెలిపారు. విజేతకు రూ.50 వేల విలువైన స్మార్ట్ఫోన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. ఎక్కువ డోసులు అందించే అర్బన్ హెల్త్కేర్ సెంటర్లకు రూ.21 వేలు అందిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్