One Nation, One Election: ఏమిటీ ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’?
భారత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం ‘ఒకే దేశం-ఒకే ఎన్నికల’పై పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసింది. కానీ, దీనికి ఆమోద ముద్రవేయించడం అంత తేలికైన పనేమీ కాదు.
ఇంటర్నెట్డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు దాదాపు పక్షం రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకొంది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (One Nation, One Election) సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవానికి గతంలో ఈ రకంగా ఎన్నికలు జరిగినా వివిధ కారణాలతో మార్పులు చోటు చేసుకొన్నాయి.
ఏమిటీ జమిలీ ఎన్నికలు..?
దేశ వ్యాప్తంగా ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నది దీని లక్ష్యం. అంటే లోక్సభ-శాసనసభ ఎన్నికల ఓటింగ్ ఒకేసారి నిర్వహించడం. ప్రస్తుతం శాసనసభలకు, పార్లమెంట్కు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రధానిగా మోదీ తొలిసారి అధికారం చేపట్టిన నాటి నుంచే దీనిపై మాట్లాడుతున్నారు.
కేంద్రం కీలక నిర్ణయం.. ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’పై కమిటీ..!
అంత తేలిక కాదు..
ఈ బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67శాతం అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్థించాలి. దీనికి తోడు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోద ముద్రవేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లు పక్షాన నిలవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం భాజపా 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. దానికి మద్దతు ఇచ్చే పక్షాలు మరో 6 రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. ఎన్డీఏకు లోక్భలో దాదాపు 333 ఓట్ల బలం ఉంది. ఇది 61శాతానికి సమానం. మరో 5శాతం ఓటింగ్ను సంపాదించడం దానికి కష్టమే. రాజ్యసభలో కేవలం 38శాతం మాత్రమే సీట్లు ఉన్నాయి.
కలిపి ఎన్నికలు ఎందుకు..?
2019లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ. 10,000 కోట్లు వెచ్చించినట్లు అంచనాలున్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్ర ఎన్నికలకు ప్రభుత్వం రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఖర్చుకు రాజకీయ పార్టీల వ్యయం చేర్చితే కళ్లు తిరిగిపోతాయి. 2019 లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీల ఖర్చు రూ.60 వేల కోట్ల వరకు ఉందని అప్పట్లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ వెల్లడించింది. భారత చరిత్రలోనే అవి అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఈ ఖర్చు మొత్తం కలిసొస్తుందన్న వాదన ఉంది.
- దీంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థంగా వినియోగించుకొనే అవకాశం లభిస్తుంది. సాధారణ అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటే పాలన మందగిస్తుంది. అందుకే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే.. సమయం ఆదా అయి వారు పాలనపై దృష్టి సారించడానికి అవకాశం లభిస్తుంది.
- కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, పథకాలను అమలు చేయడంలో తరచూ ఎన్నికల కోడ్ రూపంలో అడ్డంకులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. దీంతోపాటు ఎన్నికల కోడ్ కారణంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం వంటివి వాయిదా పడే అవకాశాలుండవు.
- జమిలీ ఎన్నికల కారణంగా ఒకేసారి అన్ని రకాల ఓటింగ్లు జరగడం ఓటర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఫలితంగా పోలింగ్ శాతం పెరుగుతుందని లా కమిషన్ పేర్కొంది.
ఇబ్బందులూ ఉన్నాయి..
శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరపడానికి వీలుగా రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను సవరించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్రాల అంగీకారం కూడా చాలా అవసరం.
- జమిలీ ఎన్నికల కారణంగా జాతీయ అంశాలు ప్రచారంలో అధిక భాగాన్ని ఆక్రమిస్తే.. స్థానిక అంశాల పాత్ర తగ్గిపోతుందని పార్టీలు భయపడుతున్నాయి. ముఖ్యంగా స్థానిక పార్టీల్లో ఈ భయం ఎక్కువగా ఉంది. ఇక ఎన్నికల ఖర్చులో కూడా స్థానిక పార్టీలు జాతీయ పార్టీలతో పోటీపడాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతుందనే అనుమానాలున్నాయి.
- 2015లో జరిగిన ఓ సర్వే ప్రకారం, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయి. అదే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలలు తేడాతో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61శాతానికి తగ్గిపోతాయని తేలింది.
గతంలో జరిగినా..
1967 వరకు ఈ విధంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దుకావడం, 1970లో ఏడాది ముందే లోక్సభ రద్దు వంటి పరిణామాలతో ఈ విధానం కొనసాగించడం సాధ్యం కాలేదు. 1983లో ఎన్నికల కమిషన్ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. కానీ, అప్పట్లో ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. 1999లో లా కమిషన్ నివేదిక దీనిని మరోసారి లేవనెత్తింది. 2016లో ప్రధాని మోదీ ఈ ఆలోచనను మరోసారి ప్రతిపాదించారు. ఆ మరుసటి ఏడాదే దీనిపై నీతి ఆయోగ్ కసరత్తు చేసింది. 2019లో ఈ అంశంపై ప్రధాని వివిధ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్ సహా చాలా పక్షాలు దీనికి దూరంగా ఉన్నాయి. అతికొద్ది పార్టీలు మాత్రమే ప్రతినిధులను పంపాయి.
- 2022లో తాము జమిలీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. 2022 డిసెంబర్లో ఈ రకం ఎన్నికలపై లాకమిషన్ వివిధ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!