విక్కీ ‘అశ్వత్థామ’ చిత్రంలో సారా అలీఖాన్?
విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ - పౌరాణిక యాక్షన్ చిత్రం ‘ది ఇమ్మోర్ట్ల్ అశ్వథ్థామ’. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా సారా అలీఖాన్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా సారా అలీఖాన్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ఆమె కూడా చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. సినిమాలోని పాత్ర కోసం ఆమెకు శిక్షణ కూడా ఇవ్వనున్నారట. ఇందులో ఆమె చేయబోయే కొన్ని పోరాట సన్నివేశాలు కథలో కీలకం కానున్నాయట. ఆర్ఎస్వీపీ సమర్పణలో రూపొందుతున్న చిత్రానికి రోన్నీ స్ర్కూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇక విక్కీ కౌశల్ సైతం సినిమా కోసం శారీరక శిక్షణతో పాటు గుర్రపుస్వారీ, విలువిద్య వంటి అంశాలపై దృష్టిపెట్టారు. వాటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. సారా అలీఖాన్ ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. కానీ ఈ చిత్రంలోని పాత్ర మాత్రం ఆమెకు కొత్తగా ఉండనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమాకి మితేష్ మిర్చందాని ఛాయాగ్రాహకుడిగా పనిచేయనున్నారు. సారా ప్రస్తుతం ‘అత్రాంగి రే’లో సాగరిక శర్మ పాత్రలో నటిస్తోంది. ఇందులో అక్షయ్ కుమార్, ధనుష్ కూడా నటిస్తున్నారు. గత ఏడాది సారా అలీఖాన్ - వరుణ్ ధావన్తో కలిసి ‘కూలీ నెం.1’ చిత్రంలో నటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!