‘రిపబ్లిక్‌’.. జోర్‌సే బర్‌సే

సాయితేజ్‌ కథానాయకుడిగా దేవ్‌ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ.స్టూడియోస్‌తో కలిసి జె.పుల్లారావు, జె.భగవాన్‌ నిర్మిస్తున్నారు

Updated : 04 Sep 2021 07:39 IST

సాయితేజ్‌ కథానాయకుడిగా దేవ్‌ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ.స్టూడియోస్‌తో కలిసి జె.పుల్లారావు, జె.భగవాన్‌ నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ‘‘జోర్‌సే బర్‌సే’’ అంటూ సాగే ఈ పాటను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు సాయితేజ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించి శుక్రవారం ఓ ప్రచార వీడియోని ట్విటర్‌లో పంచుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని