Arjun: మహేష్తో తలపడనున్న యాక్షన్ కింగ్?
మహేష్బాబు కథానాయకుడిగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో ప్రతినాయకుడిగా అర్జున్ సర్జా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన చిత్రంలో నటించేందుకు తన అంగీకారాన్ని తెలియజేశారని చెప్పుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మహేష్బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా అర్జున్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన చిత్రంలో నటించేందుకు తన అంగీకారాన్ని తెలియజేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జులైలోనే సినిమా తిరిగి పునః ప్రారభించడానికి సిద్ధమయ్యారు. కొత్త షెడ్యూల్ సినిమా షూటింగ్లో పనిచేసే ప్రతి ఒక్కరి కొవిడ్ టీకాలు వేయించాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జులైలో జరిగే షూటింగ్ కోసం హైదరాబాద్లోనే ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో మహేష్ - అర్జున్లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇందులో కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. వెన్నెల కిశోర్, సుబ్బరాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు