కేసీఆర్‌ను చూస్తే గోబెల్స్‌ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్‌

తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Updated : 30 Apr 2024 10:48 IST

హైదరాబాద్‌: తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారాస అధినేత కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్స్‌ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ఎక్స్‌(ట్విటర్‌)లో విరుచుకుపడ్డారు. ‘ఎక్స్‌లో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు. మొన్న సూర్యాపేట, నిన్న మహబూబ్‌నగర్‌, ఇవాళ ఓయూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే నెలపాటు హాస్టళ్ల మూసివేతకు నోటీసు ఇచ్చారు. అందులో విద్యుత్‌, నీటి కొరత  గురించి ప్రస్తావించారు. మేం వచ్చాకే మూసేస్తున్నట్లు చెప్పడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ఠ’’ అని రేవంత్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని