జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు.
రాజధానిపై నియంతలా ఏకపక్ష నిర్ణయం
కేసుల నుంచి రక్షణకే ప్రత్యేక హోదాపై రాజీ
ఓటమి భయంతో కూటమి ఏర్పడకుండా ఎత్తులు
బెయిల్ కోసం తల్లిని, చెల్లిని రాయబారానికి పంపి.. సోనియాకు ఎదురు తిరిగిన వీరుడంటూ గొప్పలు
‘విధ్వంసం’ పుస్తక రచయిత ఆలపాటి సురేశ్కుమార్
ఈనాడు, అమరావతి: ‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. కానీ అతనిలో తీవ్ర అభద్రతాభావం, భయం గూడుకట్టుకొని ఉన్నాయి. ఆయన సింహం కాదు, చిట్టెలుక. సింహం సింగిల్గా వస్తుందన్న సినిమా డైలాగులు వినడానికే బాగుంటాయి. నిజానికి అడవిలో ఏ సింహమూ సింగిల్గా ఉండదు. ఒక్కటే వేటాడదు. అవి గుంపులుగా ఉండి జంతువులను వేటాడి చంపుతాయి. జగన్తో కలిసేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రానందునే వైకాపా ఒంటరిగా పోటీ చేస్తోంది. దీన్నే సింగిల్గా వస్తున్నామంటూ భ్రమ కల్పిస్తున్నారు’ అని ‘విధ్వంసం’ పుస్తక రచయిత ఆలపాటి సురేశ్కుమార్ విశ్లేషించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో వివిధ వ్యవస్థలపై జరిగిన దాడిని వివరిస్తూ ఆయన ‘విధ్వంసం’ పేరిట పుస్తకం రాశారు. జగన్ పాలనా తీరుతెన్నులపై సురేశ్కుమార్ ఇటీవల విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. వివరాలు..
బెయిల్ కోసం రాయబారానికి వెళ్తే.. వీరుడా?
అవినీతి కేసుల్లో జగన్ను జైలుకు పంపితే.. ఎలాగైనా బెయిల్ వచ్చేలా చేసి, బయటకు తేవాలంటూ తల్లిని, చెల్లిని దిల్లీలోని సోనియా గాంధీ వద్దకు రాయబారానికి పంపారు. ఈ విషయాన్ని స్వయంగా షర్మిల ఇటీవల బయటపెట్టారు. ఇవన్నీ ప్రజలకు తెలియనప్పుడు ఆయన వీరుడు, శూరుడని ప్రచారం చేసుకుంటారు. సోనియాకే ఎదురొడ్డి నిలబడ్డారని గొప్పలు చెప్పారు. కానీ, నిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కో రూపంలో జగన్ అక్రమంగా సంపాదించినందునే సీబీఐ, ఈడీ కేసులు పెట్టాయి. వాటిలో నిజాలు లేకపోతే ఆ కేసులు ఛార్జిషీట్ల వరకు ఎలా వస్తాయి? అన్ని కేసుల్లోనూ ఏ1 గా ఉన్న జగన్.. సహ నిందితులతో వేర్వేరుగా డిశ్చార్జి పిటిషన్లు వేయిస్తూ పదేళ్లకు పైగా లాక్కొచ్చారు. వీటిపై ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకోలేరు కాబట్టే జగన్ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. సొంత మీడియా ఉందన్న ధీమాతో విలేకరుల సమావేశాలూ పెట్టలేదు.
వైకాపా స్వరం మారింది అప్పుడే..
తొలుత జనసేన, భాజపాతో జత కట్టాక వైకాపా ఎలాంటి విమర్శలూ చేయలేదు. ‘ఈసారి వైకాపా వ్యతిరేక ఓట్లు చీలనివ్వను’ అని పవన్ కల్యాణ్ ప్రకటించిన మరుక్షణమే వైకాపా నేతల దాడి మొదలైంది. ‘ఒంటరిగా బరిలోకి దిగు’ అంటూ పవన్ను రెచ్చగొట్టడం ప్రారంభించారు. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడితే తన గెలుపు కష్టమని తెలిసే వైకాపా పదేపదే పవన్పై విమర్శలు చేసింది. ఇది జగన్లో తీవ్రభయాన్ని సూచిస్తోంది. గత ఎన్నికలకు ముందు జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వారితో చెప్పించారు. గెలిచాక మూడు రాజధానుల నాటకమాడి నమ్మక ద్రోహం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం ఇప్పటికీ చర్చించలేదు. వాళ్లంటే భయం. అందుకే జగన్ రాజధాని గ్రామాల మీదుగా అసెంబ్లీకి వెళ్లేటప్పుడు ఇళ్ల ముందు పరదాలు కట్టిస్తున్నారు.
దోపిడీకి ముందస్తు ప్రణాళికలు
అధికారంలోకి వస్తే డబ్బు ఎలా పోగేయాలో జగన్ ముందుగానే మార్గాలు వెతుక్కున్నారు. ఇసుక మాఫియా గోల పడలేక చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తెచ్చారు. జగన్ ఆ విధానాన్ని మారుస్తున్నానంటూ దోపిడీకి వ్యూహం రచించి అమలు చేశారు. ఇసుకలో భయంకరమైన అక్రమార్జన జరిగింది. పర్యావరణం దెబ్బతింది. మద్యం పాలసీ అంతే. తెలంగాణలో ఉత్పత్తిదారు నుంచి ప్రభుత్వ రంగ సంస్థ మద్యాన్ని హోల్సేల్గా కొని, రిటైల్ వ్యాపారులకు అమ్ముతుంది. ఏపీలో మాత్రం టోకు, చిల్లర వ్యాపారం ప్రభుత్వమే చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తిదారులుగా అధికార పార్టీ నేతలే వ్యాపారంలోకి దిగారు. దేశమంతటా లభించే మద్యం బ్రాండ్లు ఏవీ రాష్ట్రంలోకి రానివ్వకుండా, పనికిరాని బ్రాండ్లను తయారుచేసి దోచేశారు. ఇసుక, మద్యం విక్రయాల్లో నగదు మాత్రమే తీసుకోవడం దోపిడీలో భాగమే.
అధికారులు ఎదురు చెప్పకూడదు
ఐఏఎస్లు, ఐపీఎస్లు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా మన వ్యవస్థ వారికి రాజ్యాంగ రక్షణ కల్పించింది. కానీ జగన్ ఎక్కువ మంది అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారు. తన పాలనను గుడ్డిగా సమర్థించేలా చేసుకున్నారు. వైఎస్ హయాంలో జగన్ ఆర్థిక కుంభకోణాలకు సహకరించిన అధికారులను ఏపీకి తెచ్చుకొని, కీలక పోస్టుల్లో కూర్చోబెట్టారు. ఐదేళ్లలో ప్రతిపక్ష నేతలకు గత, ప్రస్తుత డీజీపీ ఒక్కసారీ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఎంత ఘోరమైన పరిస్థితో అర్థమవుతోంది. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టారు. అప్పట్లో కొవిడ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ వాయిదా వేస్తే, జగన్ ఆయన్ను కులం పేరుతో తిట్టిపోశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డను పంచాయతీరాజ్ చట్టసవరణ ద్వారా తప్పించారు. ఇది తప్పు అని అప్పటి సీఎస్ ఎందుకు చెప్పలేకపోయారు? చివరకు న్యాయస్థానం ముందు అభాసుపాలయ్యారు. మొత్తంగా ఐదేళ్లు అస్తవ్యస్త పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు.
మోదీకి ఎందుకు మోకరిల్లారు?
చంద్రబాబు ప్రత్యేక హోదా తేలేదని పలుమార్లు విమర్శించిన జగన్.. మరి ఐదేళ్ల పాలనలో తానెందుకు సాధించలేదో చెప్పరు. రాజ్యసభలో కీలక బిల్లులను దేశమంతా వ్యతిరేకించినా, జగన్ మద్దతిచ్చారు. ఆ సమయంలో తమ మద్దతు కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వండని మోదీకి ఎందుకు షరతు పెట్టలేదు? జగన్పై ఉన్న కేసులే ఇందుకు కారణం. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. జగన్ ఐదేళ్లూ విపరీతమైన అహంభావంతో నిరంకుశంగా పాలన సాగించారు. ఎవరి మాటా వినలేదు. నియంతలంతా పిరికివారని చరిత్ర చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. -
గులకరాయి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. -
జూ.ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
జూనియర్ ఎన్టీఆర్కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. -
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. -
పోలీసులు అమాయకులను బలిచేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ పిల్లలకు పలక ఇచ్చారా?
-
విధి వంచితులకు చేయూత
అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు. -
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
విద్యార్థులూ, తాజా గ్రాడ్యుయేట్లూ తమ అభిరుచిమేరకు కెరియర్ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచ విలువైన అనుభవాన్ని గడించడానికి ఇంటర్న్షిప్లు తోడ్పడతాయి. -
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. -
నాలుగు సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలు
రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.