సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కొట్టేశారు.. పోలీసులు 25 నిమిషాల్లోనే రప్పించారు
ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది.
బాధితుడి అప్రమత్తతకు సీఎస్బీ స్పందన తోడైన ఫలితం
ఈనాడు, హైదరాబాద్: ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే సైబర్ నేరస్థులు రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలో బాధితుడి కుటుంబం బ్యాంకును అప్రమత్తం చేసింది. వెనువెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు 25 నిమిషాల లోపే ఆ సొమ్మును వెనక్కి రప్పించారు. బాధితుడి అప్రమత్తతకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్సీఎస్బీ) తక్షణ స్పందన తోడు కావడంతో ఇదంతా సాధ్యమైంది. సైబర్ నేరస్థుల పాలైన సొమ్మును తిరిగి రప్పించడం గగనమైన ప్రస్తుత తరుణంలో ఈ తరహా ఉదంతం ‘గోల్డెన్ అవర్’ ఘనతను చాటిందని పోలీసులు వివరించారు.
టీఎస్సీఎస్బీ కథనం ప్రకారం.. హైదరాబాద్ నాచారానికి చెందిన హర్ష్ ఫోన్కు ఈ నెల 27న ఉదయం మూడు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. అతడి ఖాతా నుంచి ఉదయం 10.09 గంటలకు రూ.50 లక్షలు, 10.10 గంటలకు మరో రూ.50 లక్షలు, 10.11 గంటలకు రూ.10 లక్షలు మరో ఖాతాకు బదిలీ అయ్యాయనేది వాటి సారాంశం. 10.17 గంటల సమయంలో ఆ సందేశాలను చూసిన హర్ష్ హతాశుడయ్యారు. తన ప్రమేయం లేకుండానే ఏకంగా రూ.కోటి పదిలక్షలు ఇతరుల ఖాతాకు బదిలీ కావడంతో తొలుత ఆందోళనకు గురైన ఆయన వెంటనే తేరుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో తొలుత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. అంతటితో ఆగకుండా 10.22 గంటలకు 1930 నంబరుకు ఫోన్ చేసి జరిగిన మోసాన్ని వివరించారు.
బెంగళూరు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తింపు
నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్పీ) నేతృత్వంలోని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజమెంట్ సిస్టమ్(సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. తెలంగాణలో ఈ మోసం జరగడంతో టీఎస్సీఎస్బీ కూడా అప్రమత్తమైంది. వెంటనే నగదు బదిలీ జరిగిన యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల ప్రతినిధులను అప్రమత్తం చేసింది. అవన్నీ సత్ఫలితాన్నిచ్చాయి. సదరు సొమ్మును సైబర్ నేరస్థులు ఖాతాల నుంచి డ్రా చేయకుండా నిలిపేసినట్లు(పుట్ ఆన్ హోల్డ్) బాధితుడి చరవాణికి 10.42 గంటల సమయంలో సందేశం వచ్చింది. ‘అప్పటికి నేరస్థులు రూ.10 వేలు మాత్రమే డ్రా చేయగలిగారు. డబ్బు బెంగళూరులోని ఖాతాలకు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది. అవి సజావుద్దీన్, సలీముద్దీన్ ఖాతాలుగా గుర్తించాం. బాధితుడి ప్రమేయం లేకుండా నగదు బదిలీ ఎలా జరిగిందని తెలుసుకునే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. డబ్బులు పోగొట్టుకున్న వెంటనే తేరుకుని ఫిర్యాదు చేయగలిగితే వెనక్కి తెచ్చేందుకు అవకాశముంటుందనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం’ అని టీఎస్సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయెల్ పేర్కొన్నారు. ‘టీఎస్సీఎస్బీ యంత్రాంగం నాతో ఫోన్లో మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్న సమయంలోనే డబ్బు డ్రా చేయకుండా నిలిపేసినట్టు బ్యాంకు నుంచి సంక్షిప్త సందేశం వచ్చింది. మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి’ అని బాధితుడు హర్ష్ పేర్కొన్నారు. టీఎస్సీఎస్బీ పనితీరును కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
భూ తగాదాల నేపథ్యంలో జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదం నింపింది. -
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
-
శిఖర్ పహారియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
-
వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్, రష్యా త్వరలో చర్చలు!
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు