Bhediya: ఇది నయం కాకపోతే మనుషుల్ని తింటూనే ఉంటా.. ఆసక్తికరంగా ‘భేడియా’ ట్రైలర్
వరుణ్ ధావన్ - కృతిసనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం ‘భేడియా’. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ముంబయి: ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అతడు మళ్లీ సాధారణమైన మనిషిగా మారాడా? లేదా? అనే ఆసక్తికర అంశాలతో రూపుదిద్దుకున్న చిత్రం ‘భేడియా’ (Bhediya). వరుణ్ ధావన్ (Varun Dhawan) - కృతిసనన్ (Kriti Sanon) జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం ‘భేడియా’ ట్రైలర్ విడుదల చేసింది. తోడేలుగా మారిన వ్యక్తిగా వరుణ్ ధావన్ నటన ఆకట్టుకునేలా ఉంది. ఉదయం పూట సాధారణమైన యువకుడిగా కనిపిస్తూనే రాత్రి వేళల్లో తోడేలుగా మారి, ఇతరులపై దాడి చేయడం వంటి సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ‘‘ప్రతిరోజూ రాత్రి నేను ఏం చేస్తున్నానో నాక్కూడా తెలియదు. ఒక తోడేలు నా శరీరాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఉన్నట్టుండి డ్రాకులా వంటి పదునైన కోరలు, పంజా.. తోక కూడా వస్తుంది. ఒకవేళ నాకు నయం కాకపోతే నేను మనుషులను తింటూనే ఉంటా’’ అంటూ వరుణ్ ధావన్ చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో