Bigg Boss Telugu5: నాగార్జున ఎంట్రీ అదుర్స్.. బిగ్బాస్ హౌస్ విశేషాలివే!
నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ‘బిగ్బాస్ తెలుగు’ ఇప్పుడు ఐదో సీజన్ మొదలైంది. అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా ఆదివారం అదిరే గ్రాండ్ ఎంట్రీతో అలరించింది.
హైదరాబాద్: బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. అదిరిపోయే గేమ్లు.. లగ్జరీ బడ్జెట్ టాస్క్లు.. కెప్టెన్సీ కోసం పోటీలు కనువిందు చేయనున్నాయి. అంతులేని ప్రేమలు.. అంతలోనే గొడవలు.. ఎవర్గ్రీన్ స్నేహాలతో సందడి షురూ కానుంది. అదే అలరించే రియాల్టీ షో ‘బిగ్బాస్’. నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ‘బిగ్బాస్ తెలుగు’ ఇప్పుడు ఐదో సీజన్ మొదలైంది. అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా ఆదివారం అదిరే గ్రాండ్ ఎంట్రీతో అలరించింది. క్లాస్, మాస్ సాంగ్లతో నాగ్ ఎంట్రీ అదిరింది. ‘‘పంచాక్షరాల సాక్షిగా.. పంచేంద్రియాల సాక్షిగా.. పంచ భూతాల సాక్షిగా.. నా పంచ ప్రాణాలు మీరే(అభిమానులు)’’ అంటూ నాగ్ ఈసారి ఐదు రెట్ల వినోదాన్ని పంచడానికి వచ్చారు. బిగ్బాస్ హౌస్ గురించి వివరిస్తున్న సందర్భంలో నాగార్జున కిచెన్లోకి వెళ్లగా, ‘సరసాలు చాలు శ్రీవారు’ అంటూ సాగే పాట వినిపించడంతో ‘బిగ్బాస్.. ఈ పాట ఇప్పుడు ఎందుకు వేశారు. నేను ఇంటివెళ్లాలి కదా’ అంటూ నవ్వులు పంచారు.
బిగ్బాస్ విశేషాలు..
* బిగ్బాస్ ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది
* మొదటి సీజన్కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, శివ బాలాజీ విజేతగా నిలిచారు
* రెండో సీజన్కు నాని యాంకరింగ్ చేశారు. కౌశల్ విజయం సాధించారు
* మూడు, నాలుగు సీజన్లను అగ్ర కథానాయకుడు నాగార్జున హోస్ట్ చేశారు . రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్ విజయం సాధించారు.
* సెప్టెంబరు 5వ తేదీ నుంచి బిగ్బాస్ సీజన్-5 మొదలైంది.
* ముచ్చటగా మూడోసారి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
* బిగ్బాస్ హౌస్లో మొత్తం 70 కెమెరాలు ఉన్నాయి.
* బిగ్బాస్ హౌస్ లాంజ్ను ఎక్కువగా ఆకుపచ్చ రంగుతో తీర్చిదిద్దారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే