Tollywood Movies: తారుమారు అయ్యాయి!
ఓ అగ్ర కథానాయకుడు, ఓ అగ్ర దర్శకుడు కలిసి ఓ కొత్త చిత్రం ప్రకటించడమే ఆలస్యం సినీ అభిమానుల్లో సందడి మొదలవుతుంది. ఆ కాంబినేషన్పై మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? నాయిక ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు? అనే ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటిలానే ఇటీవల మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ విషయంలోనూ ఇదే జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ అగ్ర కథానాయకుడు, ఓ అగ్ర దర్శకుడు కలిసి కొత్త చిత్రం ప్రకటించడమే ఆలస్యం సినీ అభిమానుల్లో సందడి మొదలవుతుంది. ఆ కాంబినేషన్పై మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? నాయిక ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు? అనే ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటిలానే ఇటీవల మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ విషయంలోనూ ఇదే జరిగింది. కానీ చిన్న మార్పు చోటు చేసుకుంది. అదేంటంటే.. ముందుగా ప్రటించిన సినిమాని కాస్త వెనక్కి పెట్టి మరో చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లనున్నారు. అభిమానులకి బాగా రిజిస్టర్ అయిన వర్కింగ్ టైటిల్తో మరో దర్శకుడు ఆ సినిమాని తెరకెక్కించనున్నారు.
మహేశ్ బాబు 27, 28..
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు ‘SSMB 27’ (వర్కింగ్ టైటిల్) చిత్రం చేయాల్సి ఉంది. అంతా ఓకే అయినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అదే వర్కింగ్ టైటిల్తో పరశురామ్- మహేశ్ కాంబోలో ఓ చిత్రం ఖరారైంది. అదే ‘సర్కారు వారి పాట’. ఇది పూర్తయిన వెంటనే మహేశ్ తదుపరి చిత్రం ‘‘SSMB 28’ రాజమౌళి దర్శకత్వంలోనే టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగింది. ఇప్పుడది త్రివిక్రమ్ ఖాతాలోకి వెళ్లింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తను నటిస్తున్నట్టు మహేశ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయనున్నారు. వంశీ పైడిపల్లి, రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ 30..
గతేడాది ప్రకటించిన చిత్రాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించింది ‘ఎన్టీఆర్ 30’ (వర్కింగ్ టైటిల్). ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ప్రకటించిన సినిమా ఇది. ‘అరవింద సమేత’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో సెట్స్పైకి వెళ్లాల్సి ఉన్నా కొవిడ్, తారక్ ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉండటంతో వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఆ వర్కింగ్ టైటిల్తో కొరటాల శివ తెరపైకి వచ్చారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత మరోసారి కలిశాం అంటూ ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్రివిక్రమ్.. మహేశ్ బాబుతో చిత్రం పూర్తయ్యాక తారక్తో చేసే అవకాశాలున్నాయి.
అల్లు అర్జున్ 21..
‘ఏఏ 21’ వర్కింగ్ టైటిల్తో అల్లు అర్జున్ కథానాయకుడిగా కొరటాల శివ ఓ చిత్రం ప్రకటించారు. మరోవైపు ఎన్టీఆర్తో ఓ చిత్రం చేస్తుండటంతో ‘ఏఏ 21’ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ‘అవన్నీ అవాస్తవం.. కచ్చితంగా ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుంది’ అని చిత్ర బృందం వెల్లడించింది. ఇదిలా ఉంటే బన్నితో ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురగదాస్తో కథా చర్చలు జరుపుతున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది ఓకే అయితే ‘ఏఏ 21’కి దర్శకుడు మురగదాస్ అవుతారు. ‘ఏఏ 22’కి దర్శకుడిగా కొరటాల నిలుస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!