Director Trinadha Rao: తెలుగు సినీ దర్శకుడు త్రినాథరావు ఇంట విషాదం

Director Trinadha Rao: దర్శకుడు త్రినాథరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి సోమవారం రాత్రి కన్నుమూశారు.

Published : 30 Apr 2024 19:31 IST

హైదరాబాద్‌: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు త్రినాథరావు  తండ్రి నక్కిన సూర్యారావు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. త్రినాథరావు స్వగ్రామం అనకాపల్లిలో అంత్యక్రియలు చేశారు.  ఈ సందర్భంగా సినీ ప్రముఖులు,నటీనటులు సోషల్‌ మీడియాలో వేదికగా త్రినాథరావు కుటుంబానికి సంతాపం తెలిపారు. సూర్యారావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ‘ప్రియతమా నివచట కుశలమా’ చిత్రంతో దర్శకుడిగా మారిన త్రినాథరావు...  ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్‌’, ‘హలో గురు ప్రేమకోసమే’ ‘ధమాకా’ చిత్రాలు తీశారు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో మట్కా మూవీ చేస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని