సంక్షిప్త వార్తలు (5)
సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు చకచకా సిద్ధమవుతున్నారు కథానాయకుడు అజిత్. ఆయన ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘తునివు’. జీ స్టూడియోస్తో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్నారు.
‘తునివు’ జోరు
సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు చకచకా సిద్ధమవుతున్నారు కథానాయకుడు అజిత్. ఆయన ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘తునివు’. జీ స్టూడియోస్తో కలిసి బోనీకపూర్ నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఆదివారం ఈ చిత్రం నుంచి ఓ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. అందులో అజిత్ తుపాకీ చేతబట్టి స్టైలిష్ లుక్తో కనిపించారు. ఈ చిత్ర తొలి గీతం ‘‘చిల్లా చిల్లా’’ను త్వరలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందుతోన్న ఈ సినిమాకి జిబ్రాన్ స్వరాలందిస్తున్నారు. నీరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
ధనుష్ సినిమా కోసం...
ఏ భాషలోనైనా సరే ఇప్పుడు దాదాపు సినిమాలు పాన్ ఇండియా హంగులతోనే రూపొందుతున్నాయి. నటుల్ని, సాంకేతిక బృందాన్ని అందుకు తగ్గట్టే ఎంపిక చేసుకుంటుంటారు దర్శక నిర్మాతలు. సినిమా ఎక్కడెక్కడైతే ప్రధానంగా మార్కెట్ అవుతుందో... ఆయా భాషలకి చెందిన నటులు తెరపై కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో ఏ భాష నుంచి ఏ నటుడు, ఏ పాత్రలో కనిపిస్తారో ఊహించలేని పరిస్థితి. తాజాగా ధనుష్ సినిమా కోసం సంజయ్దత్ని సంప్రదించినట్టు సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ పాత్ర కోసం సంజయ్దత్ని ఎంపిక చేసుకునే దిశగా చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ‘కేజీఎఫ్ 2’లో సంజయ్దత్ విలన్గా మెప్పించి, ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే.
ఇదే గెటప్తో ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’
‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ ప్రాజెక్టు మొదలైన దగ్గర్నుంచి అన్నీ సంచలనాలే. పేరు మార్పు, భారీ తారాగణం, విడుదల తేదీ.. ఇవన్నీ వార్తలే. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాని సాజిద్ నడియాద్వాలాతో కలిసి బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ఖాన్ నిర్మిస్తూ, నటిస్తున్నారు. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తైంది. అందుకు సంబంధించిన ఓ షూటింగ్ పొటోని సల్మాన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో కనిపిస్తున్నారు. ‘షూటింగ్ పూర్తైంది. ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ వచ్చే ఏడాది ఈద్కి వస్తున్నాడు’ అని ఫొటోకి ట్వీట్ జోడించారు. ఫర్హాద్ షంజీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, పూజా హెగ్డే, జగపతిబాబు, భాగ్యశ్రీ, హెహ్నాజ్ గిల్, భూమికా చావ్లా.. కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆసుపత్రిలో.. బాలీవుడ్ సీనియర్ నిర్మాత
బాలీవుడ్ సీనియర్ నిర్మాత నితిన్ మన్మోహన్ గుండెనొప్పితో ఆదివారం ముంబయి ఆసుపత్రిలో చేరారు. ‘లాడ్లా’, ‘దస్’, ‘భాఘీ’, ‘రెడీ’లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారాయన. ‘నితిన్ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. శ్వాస సైతం సరిగా తీసుకోలేకపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్లిష్టంగానే ఉంది. నలభై ఎనిమిది గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేం అని వైద్యులు అంటున్నారు’ అంటూ నితిన్ స్నేహితుడు ఖలీంఖాన్ పరిస్థితి వివరించారు.
ఇది అరుదైన చిత్రం
చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్, ప్రియా పాల్వాయి, ఖ్యాతి లీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. మునికృష్ణ దర్శకుడు. దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా అరుదైన చిత్రం. మంచి కథతో తెరకెక్కింది. వాస్తవికతకు దగ్గరగా సహజంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో కాశీ విశిష్టత గురించి గొప్పగా చెప్పారు. ఇందులో అందమైన ప్రేమకథ కూడా ఉంది’’ అంది నాయిక ఖ్యాతి లీన్. ‘‘రోడ్డు ప్రయాణ నేపథ్యంలో సాగే కథతో రూపొందిన చిత్రమిది. కాశీ యాత్ర కొంతమంది జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో తెలియాలంటే మా చిత్రం చూడాలి’’ అన్నారు దర్శకుడు. మంచి సినిమాని అందరూ విజయవంతం చేస్తారనే నమ్మకం ఉందన్నారు నిర్మాతలు. సంగీతం: ఫణికల్యాణ్, ఛాయాగ్రహణం: గోకుల్ భారతి, శ్రీసాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు