akshay kumar: అక్షయ్‌ కొత్త చిత్రం

‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన..

Updated : 27 Apr 2024 09:25 IST

డే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కిస్తున్న ఓ హారర్‌ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న దర్శకుడు రాబోయే ఈ ప్రాజెక్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ప్రస్తుతం నేను రామమందిర చరిత్రపై ఓ డాక్యుమెంటరీని పూర్తి చేసే పనిలో ఉన్నాను. దీని తదుపరి అద్భుతమైన నటుడు అక్షయ్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను. ఆయన కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు మళ్లీ అక్షయ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతుంది. దీంతో పాటు బ్లాక్‌ మ్యాజిక్‌ ఇందులో ప్రధాన అంశంగా ఉండబోతుంద’’ని చెప్పుకొచ్చారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్టును ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్నారు.

ముగిసిన ‘స్కై ఫోర్స్‌’..

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘స్కై ఫోర్స్‌’. సందీప్‌ కెవ్లానీ తెరకెక్కిస్తున్నారు. సారా అలీఖాన్‌ కథానాయిక. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుపుతూ..సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను పంచుకుంది చిత్రబృందం. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. జియో స్టూడియోస్‌, మడాక్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు