Cinema News: సినిమా కలలతో... ‘కొంచెం హట్కే’
గురుచరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రధారులుగా... అవినాష్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘కొంచెం హట్కే’. అభిమాన థియేటర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
గురుచరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రధారులుగా... అవినాష్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘కొంచెం హట్కే’. అభిమాన థియేటర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకురాలు నందినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘భిన్న ప్రపంచాల నుంచి వచ్చిన వ్యక్తులంతా కలిసి ఓ సినిమా తీయాలనుకోవడమే ఇందులో కథ. సినిమా తీశారా? వాళ్ల కలలు నెరవేరాయా? అనేది తెరపైనే చూడాలి’’ అన్నారు. కృష్ణ మంజూష. ఈ కార్యక్రమంలో రచయిత కృష్ణ రావూరి, సాయి తదితరులు పాల్గొన్నారు.
తెలుసుకోరా వెనకా ముందరా...
ఆర్ట్స్.. సైన్స్.. ఇంగ్లిష్ కంటే ముందరా... తెలుసుకోరా జరిగేదేంటో వెనకా ముందరా... అంటూ ‘జితేందర్ రెడ్డి’ పాటతో సందడిని షురూ చేశాడు. కళాశాలలో విద్యార్థి నాయకుడిగా, తన ప్రాంతంలో జరిగే అన్యాయాల్ని ఎదుర్కొనేందుకు ధైర్యంగా అడుగేసిన యువకుడిగా ఆయన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపించారో తెలియాలంటే ‘జితేందర్ రెడ్డి’ చూడాల్సిందే. రాకేశ్ వర్రె కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వైశాలి రాజ్, రియా సుమన్ ముఖ్య పాత్రలు పోషించారు. విరించివర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాత. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ‘అఆఇఈఉఊ...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు.
నవ్వించాలనే లక్ష్యం నెరవేరింది
‘‘భయపెట్టడం కంటే కూడా... నవ్వించాలనే ఉద్దేశంతోనే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాని చేశాం. థియేటర్కి వెళ్లిన ప్రేక్షకులంతా కోన వెంకట్ మార్క్ వినోదాన్ని ఆస్వాదిస్తూ, హాయిగా నవ్వుకుంటున్నారు’’ అన్నారు శివ తుర్లపాటి. నృత్య దర్శకుడైన ఆయన, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాతో మెగాఫోన్ చేతపట్టారు. అంజలి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శివ తుర్లపాటి శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఇది సీక్వెల్ సినిమా, అంజలి 50వ సినిమా అనే ఒత్తిళ్లని తీసుకోకుండా చేశా. నవ్వించాలనే లక్ష్యం నెరవేరింది. మూడో భాగం సినిమా త్వరలోనే ఉంటుంది’’ అన్నారు శివ తుర్లపాటి.
మట్టి మనుషుల కథ.. శరపంజరం
నవీన్కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘శరపంజరం’. లయ కథానాయిక. టి.గణపతిరెడ్డి నిర్మాణ సహకారం అందించారు. ఈ చిత్రం ఈ నెల 19న రానున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అతిథిగా హాజరై ట్రైలర్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల వెతల నేపథ్యంలో తీసిన చిత్రమిది. మట్టి మనుషుల జీవితాల్ని తీసుకుని, తొలి ప్రయత్నంలోనే సామాజిక చైతన్యం కోసం పాటుపడే చిత్రాన్ని తీసిన నవీన్ గట్టుకు అభినందనలు’’ అన్నారు.
‘మేకప్ మ్యాన్’ల జీవితం ఆధారంగా
ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్ అవుటూరి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘మేకప్ మ్యాన్’. దివాకర్ యడ్ల దర్శకుడు. కుమార్ మెట్టుపల్లి నిర్మాత. శనివారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. దర్శకుడు రవికుమార్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్నిచ్చారు. నిర్మాత సాయివెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, భరత్ పారేపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమలో మేకప్ మ్యాన్ ప్రాముఖ్యత చాలా కీలకం. వాళ్ల జీవితాల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది. -
వెనుదిరగక వెతుకు
‘ఇలాంటి పాత్రని పోషించడం నాకెరీర్లో ఇదే మొదటిసార’ని చెబుతున్నారు కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. -
జోడీ.. తేలేదెప్పుడో?
కథానాయకులతో కథ సెట్టయ్యిందంటే చాలు ఆ తర్వాత కసరత్తులన్నీ ఆయనకు జోడీగా కనిపించే నాయిక చుట్టూనే తిరుగుతుంటాయి. సినీప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా కొత్త భామతో ముందుకెళ్లాలా.. మార్కెట్ను ప్రభావితం చేసేలా హిట్టు జోడీని పునరావృతం చేయాలా.. -
‘గోట్’కి ‘అవతార్’ నిపుణుల వీఎఫ్ఎక్స్
అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా భారీ బడ్జెట్తో, అత్యంత భారీ అంచనాల మధ్య ముస్తాబవుతున్న చిత్రం ‘గోట్’. వెంకట్ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రానికి మరో ఆసక్తికర విషయం తోడైంది. -
ఎమర్జెన్సీ మరోసారి వాయిదా
బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. 1975ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. -
కవితా కృష్ణమూర్తికి లైఫ్టైమ్ అఛీవ్మెంట్ అవార్డు
శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, సీనియర్ నేపథ్య గాయని కవితా కృష్ణమూర్తి యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (యూకేఏఎఫ్ఎఫ్) జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. -
కేన్స్లో మన అందాలు
ఈ వేడుకలో నలుపు తెలుపు రంగుల కలబోతగా ఉన్న గౌను ధరించి ఆకట్టుకుంది ఐశ్వర్య. -
థియేటర్ల బంద్ వ్యక్తిగత నిర్ణయమే
‘తక్కువ వసూళ్లు వస్తున్నాయనే కారణంతో థియేటర్లు మూసివేయడం అనేది యాజమాన్యాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. -
దివ్యవతి దెయ్యం ఎందుకైంది?
‘‘కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాల్ని తప్పకుండా చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకి కళ వస్తుంది’’ అన్నారు ఆశిష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM