పవన్ సరసన బాలీవుడ్ భామ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విలక్షణ దర్శకుడు క్రిష్ కలయికలో రాబోతున్న సినిమాలో బాలీవుడ్ భామా జాక్వెలిన్ ఫెర్నండెజ్ నటించబోతున్నట్లు సమాచారం. గతేడాది వచ్చిన సాహో సినిమాలో ప్రభాస్ సరసన ఒక ప్రత్యేకగీతంలో నటించింది. ఇప్పుడు కథానాయికగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విలక్షణ దర్శకుడు క్రిష్ కలయికలో రాబోతున్న సినిమాలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించబోతున్నట్లు సమాచారం. గతేడాది వచ్చిన సాహో సినిమాలో ప్రభాస్ సరసన ఒక ప్రత్యేకగీతంలో నటించింది. ఇప్పుడు ఈ సినిమా ద్వారా కథానాయికగా ప్రేక్షకులను అలరించనుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా దేశంలోని ప్రధాన భాషలన్నింటిలోనూ విడుదల అవనుంది. ఇదివరకే ఆమె హైదరాబాద్కి పలుమార్లు వచ్చి కథా చర్చల్లో పాల్గొన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. కరోనా ఆంక్షలన్నీ ఎత్తేసిన వెంటనే జాక్వెలిన్ షూటింగ్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉందంట. ఈ సినిమాకి మొత్తం 40 రోజులు కేటాయించిందని సమాచారం. ఈ సినిమాలో ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో ఈ బాలీవుడ్ భామ కనిపించనుంది. 1870ల కాలం నాటి పరిస్థితులకు తగ్గట్టుగా హైదరాబాద్లో భారీ సెట్స్ వేసి సినిమా చిత్రీకరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.ప్రస్తుతం జాక్వెలిన్ బాలీవుడ్లో జాన్అబ్రహం, సల్మాన్ సినిమాల్లో కథానాయికగా నటించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం