Election Commission: పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
Election Commission: పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష నేతలకు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. అసలేం జరిగిందంటే..?
దిల్లీ: సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ డేటా (voter turnout)లో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవల లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆ వైరుద్ధ్యాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘంపై విశ్వసనీయత పడిపోయిందని, ఆ సంస్థ పూర్తి స్వతంత్రత, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటం అత్యావశ్యకమని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఈసీ (Election Commission) తీవ్రంగా ఖండించింది.
‘‘పోలింగ్ డేటాపై కాంగ్రెస్ (Congress) బాధ్యతారహిత ప్రకటనలు విస్తుగొలుపుతున్నాయి. నిష్పక్షపాతంగా జరుగుతున్న ఎన్నికల నిర్వహణలో గందరగోళం, అడ్డంకులు సృష్టించేందుకు.. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పోలింగ్ ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఎన్నికల వ్యవస్థను నిరుత్సాహపరుస్తాయి. ఖర్గే లేఖ అత్యంత అవమానకరం. ఈ ఆరోపణలన్నీ అపోహలే. ఓటింగ్ డేటా సేకరణ, పోలింగ్ శాతం ప్రకటనలో ఎలాంటి లోపాలు జరగలేదు’’ అని ఎన్నికల సంఘం వెల్లడించింది.
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
తొలి, రెండోవిడతల పోలింగ్ తుది వివరాలను ఈసీ ఇటీవల అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తొలివిడత పోలింగ్ ముగిసిన 11 రోజుల తర్వాత తుది వివరాలను ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. లోక్సభ ఎన్నికల తుది ఫలితాలను మార్చే ప్రయత్నమే ఇది అంటూ ఖర్గే తన లేఖలో ఆరోపించారు. దీనిపైనా ఈసీ తీవ్రంగా స్పందించింది.
పోలింగ్ డేటా వెల్లడిలో ఎలాంటి ఆలస్యం జరగలేదని పేర్కొంది. పోలింగ్ రోజున చెప్పిన దానికంటే వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డేటా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. గత ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని గుర్తుచేసింది. ఇలాంటి దురుద్దేశ ఆరోపణలతో ప్రజలు, రాజకీయ పార్టీల్లో అనేక సందేహాలు నెలకొంటాయని, అది దారుణమైన పరిస్థితికి దారితీస్తుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
లోక్సభ ఎన్నికల అయిదో దశ పోలింగ్ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. -
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
తన తల్లి హీరాబెన్ చివరి రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. -
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి నేపథ్యంలో.. ఆయన గౌరవార్థం భారత్లో మే 21న సంతాపదినం పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
Bail conditions for Pune teen: తన డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, షరతుల కింద ప్రమాదంపై ఆ బాలుడిని వ్యాసం రాయమని న్యాయస్థానం చెప్పడం గమనార్హం. -
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటేశారు. మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. -
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు