వరుణ్‌... హిరాణీ.. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’?

ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్‌కుమార్‌ హిరాణీ, బాలీవుడ్‌ యువ కథానాయకుడు వరుణ్‌ధావన్‌ కలయికలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో వినిపిస్తోంది. కానీ   సినిమాకు సంబంధించిన

Published : 15 Jan 2022 02:23 IST

ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్‌కుమార్‌ హిరాణీ, బాలీవుడ్‌ యువ కథానాయకుడు వరుణ్‌ధావన్‌ కలయికలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో వినిపిస్తోంది. కానీ   సినిమాకు సంబంధించిన విశేషాలేవీ  బయటకు రాలేదు. తాజాగా ఈ ఇద్దరి కలయికలో సినిమా ఓకే అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే పేరుని అనుకుంటున్నట్టు సమాచారం. నిజ జీవిత కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి హిరాణీ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన కరణ్‌ నర్వేకర్‌ దర్శకత్వం వహించనున్నారట. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని