Akshay Kumar: పండగ ఆనందం రెట్టింపవుతుంది

‘‘కరోనా వల్ల రెండు మూడేళ్లుగా థియేటర్లలో సరిగ్గా సినిమాలు విడుదల కాలేదు. ఇప్పట్నుంచి రెండు మూడు  కలిసే విడుదలవుతాయి. బాగుంటే తప్పకుండా అన్నీ ఆదరణ పొందుతాయ’’ని ప్రముఖ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ అన్నారు. ఆయన

Updated : 07 Aug 2022 03:30 IST

‘‘కరోనా వల్ల రెండు మూడేళ్లుగా థియేటర్లలో సరిగ్గా సినిమాలు విడుదల కాలేదు. ఇప్పట్నుంచి రెండు మూడు  కలిసే విడుదలవుతాయి. బాగుంటే తప్పకుండా అన్నీ ఆదరణ పొందుతాయ’’ని ప్రముఖ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ అన్నారు. ఆయన అనంద్‌.ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘రక్షాబంధన్‌’. భూమి పడ్నేకర్‌ ముఖ్యభూమిక పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’ అదే రోజే విడులవుతోంది. ‘రక్షాబంధన్‌’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేశారు అక్షయ్‌కుమార్‌. అగ్రతారలు నటించిన రెండు పెద్ద సినిమాలు విడుదలవడం గురించి అక్షయ్‌ మాట్లాడారు. ‘‘రెండు మూడు సినిమాలు విడుదల కావడం తొలిసారి కాదు. ఈసారి సెలవులతో కూడిన సుదీర్ఘమైన వారం కుదిరింది. రెండు సినిమాలూ బాగా  ఆడతాయనే నమ్మకం ఉంది. రక్షాబంధన్‌ పండగ రోజే విడుదలవుతున్న మా సినిమా పండగ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంద’’న్నారు. విలేకర్ల సమావేశంలో పాల్గొన్న అనంతరం చిత్రబృందం చార్మినార్‌ని సందర్శించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని