Sanju Samson: సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏదైనా ముఖ్యమైన సిరీస్ లేదా పెద్ద టోర్నీకి భారత జట్టును ఎంపిక చేస్తుంటే.. సంజు శాంసన్ను (Sanju Samson) ఎంపిక చేయాలన్న సామాజిక మాధ్యమాల్లో బలంగా డిమాండ్లు వినిపిస్తుంటాయి. అతడికి చోటు దక్కలేదంటే నిరసన వ్యక్తమవుతుంటుంది. కొన్నేళ్ల నుంచి ఇదే వరస. గత పర్యాయం టీ20 ప్రపంచకప్లో అతడికి అవకాశం దక్కనపుడు అతని అభిమానులు సెలక్టర్లపై విరుచుకుపడ్డారు. తన పేరు ట్విట్టర్లో ట్రెండ్ అయింది. ఈసారి పొట్టి కప్పు జట్టును ఎంపిక చేయబోతుండగా సంజు కోసం డిమాండ్ గట్టిగానే వినిపించింది. అయితే సెలక్టర్లు ఈసారి అతడికి మొండిచేయి చూపించకుండా అవకాశమిచ్చారు. ఐపీఎల్లో ఈసారి కేరళ కుర్రాడు ఎన్నడూ లేనంత నిలకడగా ఆడుతుండడంతో ప్రపంచకప్లోనూ రెచ్చిపోతాడనే ఆశలు కలుగుతున్నాయి.
కొన్ని రోజుల కిందట టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించినపుడు ఒక మీమ్ వైరల్ అయింది. అందులో సంజు ‘సింపతీ కోటా’లో అవకాశం దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సంజు తన ప్రదర్శన ఆధారంగానే అవకాశం దక్కించుకున్నప్పటికీ.. మిగతా యువ ఆటగాళ్లతో పోలిస్తే సంజుకు చాలినన్ని అవకాశాలు ఇవ్వలేదని అతడిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు నిజంగానే జాలిపడుతుంటారు. ఐపీఎల్లో చాలా ఏళ్ల నుంచి శాంసన్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. కాకపోతే ప్రతీ సీజన్లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆడడం.. ఆ తర్వాత నిలకడ తప్పడం.. ఇదీ వరస. కానీ ఈసారి మాత్రం ఐపీఎల్లో మామూలుగా రెచ్చిపోవట్లేదు సంజు. మధ్యలో ఫామ్ కోల్పోకుండా నిలకడగా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 471 పరుగులు సాధించాడు శాంసన్. అతడి సగటు 67.28 కాగా.. స్ట్రైక్ రేట్ 163.54 కావడం విశేషం. ఇన్ని మ్యాచ్ల తర్వాత ఇలాంటి సగటు, స్ట్రైక్ రేట్ నమోదు చేయడం చిన్న విషయం కాదు. ప్రపంచకప్లో చోటు ఖాయమయ్యాక కూడా రిలాక్స్ అయిపోకుండా దిల్లీతో జరిగిన మ్యాచ్లో 86 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు సంజు. ఐపీఎల్-17 అత్యధిక పరుగుల వీరుల్లో సంజు స్థానం 4. ఈసారి రాజస్థాన్ పాయింట్ల పట్టికలో దూసుకెళ్తుండడానికి ప్రధాన కారణం సంజూనే అనడంలో సందేహం లేదు. ప్రపంచకప్ ముంగిట శాంసన్ ఫామ్ భారత అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది.
ముద్ర వేస్తాడా?
ఐపీఎల్లో ఎప్పట్నుంచో రాణిస్తున్నప్పటికీ.. టీమ్ఇండియాలో సంజుకు దక్కిన అవకాశాలు తక్కువే. ఆ అవకాశాలను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముందుగా టీ20ల్లో అతడికి అవకాశాలు రాగా ఆ ఫార్మాట్లో 25 మ్యాచ్లు ఆడి 18.70 సగటుతో 374 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకమే ఉంది. వన్డేల్లో సంజు ప్రదర్శన బాగానే ఉంది. 16 మ్యాచ్ల్లో 56.66 సగటుతో 510 పరుగులు సాధించాడు. అందులో దక్షిణాఫ్రికాపై దక్షిణాఫ్రికాలోనే సాధించిన శతకం (108) కూడా ఉంది. గత ఏడాది చివర్లో సాధించిన ఆ శతకమే సంజు అంతర్జాతీయ కెరీర్లో కీలక మలుపు. దీంతో అతడిపై సెలక్టర్లకు నమ్మకం కుదిరింది. ఇక ఈ ఐపీఎల్లో సంజు రెచ్చిపోవడంతో అతడికి జట్టులో చోటివ్వక తప్పలేదు. రిషబ్ పంత్ తర్వాత రెండో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ లాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ.. నిలకడగా రాణిస్తున్న సంజుకే ఛాన్సిచ్చారు. ఇప్పటివరకు తన ప్రతిభకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడని, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదని సంజుపై విమర్శలున్నాయి. అయితే ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అతడి టైం వచ్చినట్లే అనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్లో ఇదే దూకుడు కొనసాగిస్తే వన్డే, టీ20 జట్లలో అతడి స్థానం సుస్థిరం కావడం ఖాయం.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో ఓపెనర్గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు. -
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!