జీవితాంతం గుర్తుంచుకునేలా..

కొన్ని అవకాశాలు నటీనటులకు జీవితాంతం గుర్తుండేలా మిగిలిపోతాయి. ‘ఊంఛాయీ’ నాకు అలాంటి సినిమామే అంటోంది కథానాయిక పరిణీతి చోప్రా.

Published : 14 Nov 2022 01:48 IST

కొన్ని అవకాశాలు నటీనటులకు జీవితాంతం గుర్తుండేలా మిగిలిపోతాయి. ‘ఊంఛాయీ’ నాకు అలాంటి సినిమామే అంటోంది కథానాయిక పరిణీతి చోప్రా. రాజశ్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సూరజ్‌ ఆర్‌ బర్జాత్యా తెరకెక్కించిన చిత్రమిది. పరిణీతి అందులో సీనియర్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, అనుపమ్‌ఖేర్‌, బొమన్‌ ఇరానీ, సారికలతో కలిసి నటించింది. ఈమధ్యే విడుదలైన ఈ చిత్రంలో పరిణీతి నటనను అంతా మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా తను సీనియర్‌ నటులు, దర్శకుడు బర్జాత్యా కలిసి షూటింగ్‌లో పాల్గొన్న కొన్ని ఫొటోలు, సరదా వీడియోలను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘‘ఊంఛాయీ’ చిత్రీకరణలో పాల్గొన్న మధుర క్షణాలివి. ఇలాంటి షూటింగ్‌ జీవితంలో ఒక్కసారే వస్తుంది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని