NTR: ఎన్టీఆర్ 30 ముహూర్తం ఫిక్స్ చేశారా?
ప్రస్తుతం తెలుగు హీరోలందరూ పాన్ఇండియా మార్కెట్పై కన్నేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘సలార్’ రామ్చరణ్-శంకర్ మూవ...
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు హీరోలందరూ పాన్ఇండియా మార్కెట్పై కన్నేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘సలార్’ రామ్చరణ్-శంకర్ మూవీ పాన్ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుండగా స్టార్ హీరో ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్నీ పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పవర్ఫుల్ కథాంశంతో సిద్ధం కానున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ మేరకు సన్నాహాలు చేస్తుందట. అందుకు అనుగుణంగానే ఆయా చిత్రపరిశ్రమలకు చెందిన స్టార్లను ఈ ప్రాజెక్ట్లో భాగం చేస్తోందని.. ఇప్పటికే హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ నటి ఆలియాభట్ని, మ్యూజిక్ డైరెక్టర్గా కోలీవుడ్ నుంచి అనిరుధ్ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 7న ఈసినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు నెట్టింట వార్తలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా కోసం శరీరాకృతిపై దృష్టి పెట్టారట. అందుకు అనుగుణంగా ఫిట్నెస్ ట్రైనింగ్లో ఉన్నారట. ఇక, కొరటాల శివ-తారక్ కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్హిటైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?