Aishwarya Rajinikanth: మళ్లీ చాన్నాళ్లకు మెగాఫోన్‌?

రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య చాన్నాళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘3’ సినిమాతో దర్శకురాలిగా మారిన ఆమె తర్వాత ‘వై రాజ్‌ వై’ అనే చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత 2017లో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు.

Updated : 25 Sep 2022 07:19 IST

రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) చాన్నాళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘3’ సినిమాతో దర్శకురాలిగా మారిన ఆమె తర్వాత ‘వై రాజ్‌ వై’ అనే చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత 2017లో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. మళ్లీ ఇన్నేళ్లకు దర్శకత్వం చేయడానికి కథను సిద్ధం చేసుకున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ధనుష్‌తో విడాకుల తర్వాత ఐశ్వర్య చేస్తున్న చిత్రం కావడంతో కోలీవుడ్‌లో ఈ సినిమాకు గురించి చర్చ నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు