Mohan Babu: జయ జయ మహావీర

మోహన్‌బాబు కథానాయకుడిగా డైమండ్‌ రత్నబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Updated : 16 Jun 2021 08:39 IST

మోహన్‌బాబు కథానాయకుడిగా డైమండ్‌ రత్నబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మంగళవారం బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమా తొలి లిరికల్‌ గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదిక స్పందిస్తూ.. ‘‘భారతీయ సినీ పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు మోహన్‌బాబు, ఇళయరాజా కలిసి రాముడి శౌర్యాన్ని స్తుతించిన పాట ఇది. మీకు నా శుభాకాంక్షలు’’ అని తెలిపారు. 11వ శతాబ్దపు రఘువీర గద్యంతో రూపొందించిన పాట ఇది. ‘‘జయ జయ మహావీర మహాధీర’’ అంటూ ఆకట్టుకునేలా సాగుతున్న ఈ గీతానికి ఇళయరాజా స్వరాలందించగా.. రాహుల్‌ నంబియార్‌ ఆలపించారు. ఈ పాటలో మోహన్‌బాబు విభిన్నమైన లుక్స్‌లో కొత్తగా కనిపించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఛాయాగ్రాహణం: సర్వేష్‌ మురారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని