ఇందిరా గాంధీ పాత్రలో కంగన!

బాలీవుడ్‌లో మరో ఆసక్తికర బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు

Published : 30 Jan 2021 00:51 IST

ముంబయి: బాలీవుడ్‌లో మరో ఆసక్తికర బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ. ఆమె కథతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైటిల్‌ రోల్‌ పోషించేది ఎవరో తెలుసా? నిత్యం వివాదాల్లో ఉంటూ ‘నేనింతే’ అంటూ అందరినీ గడగడలాడించే కంగనా రనౌత్‌. ప్రస్తుతం ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ బయోపిక్‌ తెరపైకి వచ్చింది.

దీనిపై కంగనా స్పందిస్తూ.. ‘అవును ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. స్క్రిప్ట్‌ తుది దశలో ఉంది. అయితే, ఇది ఇందిరాగాంధీ బయోపిక్‌ కాదు. ఇదొక పిరియాడిక్‌ ఫిల్మ్‌. కేవలం పొలిటికల్‌ డ్రామా. ఈ చిత్రం ద్వారా భారతీయ రాజకీయ స్వరూపాన్ని నేటి తరానికి చూపించబోతున్నాం’ అని చెప్పుకొచ్చింది. భారత రాజకీయాల్లో ఇందిరా గాంధీ ఒక ప్రాముఖ్యత గల నాయకురాలని చెప్పిన కంగన.. తాజా చిత్రంలో పలువురు ప్రముఖ నటుడు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఎవరెవరు? ఏయే పాత్రలు పోషిస్తారో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే!

ఇదీ చదవండి..

‘కేజీయఫ్‌2’ విడుదలయ్యేది ఆ రోజే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని