తాప్సీపై కంగన డైరెక్ట్‌ ఎటాక్‌

బాలీవుడ్ నటి తాప్సీ పన్నుపై మరోనటి కంగనా రనౌత్‌ ప్రత్యేక్ష దాడికి దిగారు. 2018లో మూసివేసిన ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ పన్ను ఎగవేత కేసులో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌, ఆయనకు సంబంధించిన వారి నివాసాల్లో....

Published : 06 Mar 2021 19:10 IST

ముంబయి: బాలీవుడ్ నటి తాప్సీపై మరోనటి కంగనా రనౌత్‌ ప్రత్యక్ష దాడికి దిగారు. 2018లో మూసివేసిన ఫాంటమ్‌ ఫిలిమ్స్‌ పన్ను ఎగవేత కేసులో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌, ఆయనకు సంబంధించిన వారి నివాసాల్లో ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా తాప్సీని ఉద్దేశిస్తూ కంగన వ్యాఖ్యలు చేశారు. తాప్సీని ఓ దిగజారిన వ్యక్తిగా ఆమె సంబోధించారు. అంతేకాకుండా అనురాగ్‌.. తాప్సీకి ఓ రింగ్‌ మాస్టర్‌ లాంటివాడని ఆమె అన్నారు. 2013లో పన్ను ఎగవేత కేసుకు సంబంధించి అనురాగ్‌ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని.. ధైర్యముంటే ఈ విషయంపై కోర్టుకు వెళ్లి నిర్దోషిగా నిరూపించుకుని బయటకు రావాలని కంగన పేర్కొన్నారు.

ఐటీ దాడుల్ని ఉద్దేశిస్తూ నటి తాప్సీ తాజాగా నోరు విప్పారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం ఐటీ దాడుల్లో వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదని తాప్సీ చెప్పారు. తాను ఏ తప్పు చేయకపోయినా తనపై కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తాప్సీ చేసిన ట్వీట్‌ని ఉద్దేశిస్తూ కంగన తాజాగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని