Kareena Kapoor: ఓటీటీకి కరీనా ఓకే

బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా వెలుగొందిన కరీనా కపూర్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. పలువురు ప్రముఖ నటుల దారిలోనే ఓటీటీ మాధ్యమం ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి

Updated : 17 Mar 2022 08:04 IST

బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా వెలుగొందిన కరీనా కపూర్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. పలువురు ప్రముఖ నటుల దారిలోనే ఓటీటీ మాధ్యమం ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ కోసం ఓ చిత్రంలో నటించనుంది. ‘కహానీ’, ‘బద్లా’ లాంటి థ్రిల్లర్‌ చిత్రాలను తెరకెక్కించిన సుజయ్‌ఘోష్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేయనుంది. అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్‌ మర్డర్‌ మిస్టరీ నవల ‘డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 2005లో వచ్చిన ఈ నవల ఆధారంగా ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు రూపొందాయి. ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా దీన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది. మరోవైపు అగ్ర కథానాయకుడు ఆమీర్‌ ఖాన్‌తో కలసి ‘లాల్‌సింగ్‌ చద్ధా’లో నటిస్తోంది కరీనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని