manchu manoj: చంద్రబాబుతో మంచు మనోజ్‌ భేటీ.. పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సినీ నటుడు

manchu manoj: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడితో మంచు మనోజ్‌ సమావేశం కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ భేటీపై మనోజ్‌ విలేకరులతో మాట్లాడారు.

Updated : 31 Jul 2023 22:36 IST

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని (chandrababu naidu) సినీ నటుడు మంచు మనోజ్‌ దంపతులు (manchu manoj) కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి సతీ సమేతంగా వచ్చిన ఆయన దాదాపు 45 నిమిషాల పాటు కలిసి మాట్లాడారు. కుటుంబ వ్యవహారాలు, రాజకీయ అంశాలపై చంద్రబాబుతో మనోజ్ దంపతులు చర్చించినట్లు సమాచారం. త్వరలో ఎన్నికల రాబోతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మనోజ్‌, మౌనికల రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వాటన్నింటికీ మనోజ్‌ స్పష్టత ఇచ్చారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్‌ (manchu manoj) మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు. మేమంటే ఎంతో అభిమానం. భూమా మౌనికతో నా వివాహం తర్వాత ఆయన్ను కలవాలనుకున్నాం. కానీ, కుదరలేదు. ఈలోగా బాబుగారు కూడా కాస్త బిజీ అయ్యారు. ‘నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం’ అని చెప్పారు. ఈ రోజు ఉదయం ఫోన్‌ చేసి రమ్మంటే, వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశాం. మంగళవారం మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వచ్చి ఆశీస్సులు తీసుకున్నాం. రాజకీయాల్లోకి ప్రవేశంపై సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతుంది’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని