లఖ్నవూలో ప్రారంభమైన ‘మిషన్ మజ్ను’..
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘మిషన్ మజ్ను’.
ముంబయి: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘మిషన్ మజ్ను’. శంతన్ బాగ్చి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దక్షిణాది అందాల కథానాయిక రష్మిక మందన తొలిసారిగా బాలీవుడ్ తెరపై కనిపించనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లఖ్నవూలో ప్రారంభమైంది. సినిమా 1970ల నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్ర రా ఏజెంట్గా మిషన్కు నాయకత్వం వహించే పాత్రలో నటిస్తున్నారు. ఆర్ఎస్వీపీ మూవీస్ పతాకంపై రోనీ స్కూవాలా నిర్మిస్తున్నారు. చిత్రానికి అమర్ బుటాలా, గరిమా మెహతాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఆ మధ్య ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ...‘‘అన్ని భాషల్లో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఓ నటిగా నేను అందరికీ చేరువయ్యే చిత్రం ఇది. సినిమాకి భాష ఎంత మాత్రం అవరోధం కాదు. ‘మిషన్ మజ్ను’లో నటిస్తుండం చాలా ఆనందంగా ఉంది. చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ చిత్రంతో బాలీవుడ్లో నా ప్రయాణాన్ని, కొత్త ప్రేక్షకులను పొందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు