Prabhas: మారుతీ చిత్రంలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం..?

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే.  పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ

Published : 30 Aug 2022 15:58 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే.  పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు కథానాయికలు నటిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం కూడా టాలీవుడ్‌ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్‌. హారర్‌ కామెడీ నేపథ్యంలో మారుతీ దీన్ని తీర్చిదిద్దనున్నారు. తాత-మనవళ్లుగా రెండు పాత్రల్లోనూ ప్రభాసే నటించనున్నారని సమాచారం. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ‘రాజా డీలక్స్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు ప్రభాస్‌ వరుస చిత్రాలతో తీరికలేకుండా ఉన్నారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’, ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆది పురుష్‌’, నాగ్‌ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్‌-కె’ చేస్తున్నారు.  ఇవి కాకుండా సందీప్‌ వంగాతో ‘స్పిరిట్‌’, సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ఓ స్పై థ్రిల్లర్‌ చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని