ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది.
10-15% పెరగనున్న ప్రీమియం
ఈనాడు - హైదరాబాద్
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పుల నేపథ్యంలో బీమా సంస్థలు ప్రీమియాన్ని మరింత పెంచాలనే యోచనలో ఉన్నాయి.
ఏ వయసు వారికైనా
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లుగా ఉన్న నిబంధనను ఐఆర్డీఏఐ తొలగించింది. దీంతోపాటు ముందస్తు వ్యాధుల విషయంలో వేచి ఉండే వ్యవధిని నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. ఈ నేపథ్యంలో బీమా సంస్థలకు అధిక క్లెయింలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రీమియాలను సర్దుబాటు చేసేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
15 శాతం వరకు పెంపు
ప్రీమియం పెంచుతున్నట్లు ఇప్పటికే బీమా సంస్థలు పాలసీదారులకు సమాచారమిస్తున్నాయి. పాలసీలను బట్టి, కొత్త ప్రీమియం రేట్లు జులై, ఆగస్టు నుంచి అమలవుతాయని వెల్లడిస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం బీమా సంస్థల ప్రీమియం రేట్లు 10-15% అధికమయ్యే సూచనలున్నాయి. సాధారణ, స్టాండలోన్ ఆరోగ్య బీమా సంస్థలూ తమ పాలసీదారులకు ప్రీమియం పెంపు సమాచారాన్ని పంపిస్తున్నాయి.
ఏడాదికోసారి..
సాధారణంగా బీమా ప్రీమియాలు వయసును బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు 35 ఏళ్ల వరకు ఒకే ప్రీమియం ఉంటుంది. ఆ తర్వాత మారుతుంది. ఇలా 10-20% వరకు ప్రీమియం అధికమవుతుంది. దేశంలో సగటున ఈ పెంపు 15% ఉంటోంది. బీమా ప్రీమియాన్ని సంస్థలు మూడేళ్లకోసారి సమీక్షించేవి. క్లెయింలు, వైద్య ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ పెంపును నిర్ణయించేవి. దీనికి ఐఆర్డీఏఐ అనుమతి తీసుకోవాలి. గతంలో నియంత్రణ సంస్థ ఈ నిబంధనను సవరిస్తూ, బీమా సంస్థలకు ఏటా ప్రీమియం పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఈ పెంపు గురించి తప్పనిసరిగా ఐఆర్డీఏఐకు సమాచారం ఇచ్చి, ఆమోదం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బీమా సంస్థలు ప్రీమియం పెంచేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాయి.
పెద్దలకు కష్టమే..
65 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇవి ప్రామాణిక పాలసీల ప్రీమియం కంటే ఖరీదైనవిగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఉదాహరణకు 65 ఏళ్ల వ్యక్తికి రూ.10 లక్షల విలువైన బీమా పాలసీ అందించేందుకున్న ప్రీమియం ఇప్పుడు రూ.55,000 వరకు ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు 60 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే అధిక ప్రీమియం ఉంటోంది. పునరుద్ధరణ సమయంలో 15% వరకు పెంచితే, దాన్ని భరించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..