రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు!
జగన్మోహన్ రెడ్డి కన్నా పంటచేలల్లో దిష్టిబొమ్మలు చాలా నయం. కనీసం పక్షులను బెదరగొట్టడానికైనా అవి పనికొస్తాయి. నమ్మి ఓట్లేసి అధికారమిచ్చిన అన్నదాతలకు ఆ దిష్టిబొమ్మల పాటి సాయమైనా చేయలేదు జగన్. ‘‘ప్రతి రైతన్నకూ చెబుతున్నా.. మీకు నేనున్నాను’’ అంటూ 2019 ఎన్నికలప్పుడు ఊరూరా ఊదరగొట్టిన జగన్- సీఏంగా ఎవరిని ఉద్ధరించారు? కరవు రక్కసి కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న రైతులను వారి ఖర్మకు వారిని వదిలేశారు. ‘‘ప్రతి రైతన్నకూ మళ్లీ చెబుతున్నా.. పంటలకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పిస్తాం. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఇస్తాం’’ అని ప్రతిపక్షనేతగా ప్రతిచోటా మాటిచ్చిన జగన్- ముఖ్యమంత్రిగా రైతాంగానికేం ఒరగబెట్టారు? పెట్టుబడికి తగినట్లుగా కనీస మద్దతు ధరలను పెంచకుండా రైతన్నల రెక్కలకష్టాన్ని రాబందుల పాల్జేశారు. ‘‘అన్నదాతల ముఖంలో చిరునవ్వే లక్ష్యంగా పాలన సాగిస్తాం’’ అంటూ వాగ్దానాల కుప్పపోసిన జగన్- అయిదేళ్లలో ఏం వెలగబెట్టారు? అప్పులపాలై బతుకులు భారమై బడుగు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తాడేపల్లి ప్యాలెస్లో తిష్ఠేసుకుని వేడుక చూశారు.
జాలిలేని మొండి బండరాజు
వెర్రి తెగులు సోకిన మొక్కలు పూత పూయవు. పాముపొడ తెగులు పట్టిన ఆకులన్నీ ఎండిపోతాయి. అలాగే, జగన్ చీడసోకిన రాష్ట్రంలో ఇప్పుడు రైతు కుటుంబాలు కన్నీటి మడుగుల్లో మునిగిపోయాయి. నిరుడు జూన్ నుంచి ఆంధ్రావనిలో కరవు విలయ తాండవం చేస్తోంది. కాడికట్టి దుక్కి దున్నలేని రైతన్నల నిస్సహాయత- ఖరీఫ్, రబీల్లో 45 లక్షల ఎకరాలను బీడుపెట్టింది. కరవు, మిగ్జాం తుపాను దెబ్బకు మరో 43 లక్షల ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నాయి. ఇక రైతులు ఏం తిని బతకాలి? భార్యాబిడ్డలను ఎలా పోషించుకోవాలి? రైతుల పరిస్థితే అగమ్యగోచరమైతే ఇక వ్యవసాయ కూలీల గతేంటి? ఇవన్నీ ఆలోచించి ఆపత్కాలంలో అన్నదాతలను ఆదుకోవాల్సిన జగన్- జాలిలేని మొండి బండరాజు అయ్యారు. మొన్న డిసెంబరులో మిగ్జాం తుపాను తీవ్రతకు 20 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. జగన్ ప్రభుత్వమేమో 6.64 లక్షల ఎకరాల్లోనే చేలు దెబ్బతిన్నట్లు కాకిలెక్కలు రాసుకుంది. చినుకు నేలకు దిగకపోవడం, పొలాలకు సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్లో 23 లక్షల ఎకరాల్లో పంటలు పాడైపోయాయి. కళ్లుండీ కబోదిగా మారిన జగన్ సర్కారు- పంట నష్టాన్ని 14.21 లక్షల ఎకరాలకు తగ్గించి పారేసింది. రాష్ట్రంలో 466 మండలాల్లో దుర్భిక్షం ఛాయలు కనపడుతుంటే- అంతకంటే చాలా తక్కువ మండలాల్లోనే కరవుందన్న మొక్కుబడి ప్రకటనతో చేతులు దులుపుకొంది. పెట్టుబడి సాయం సొమ్ములను మిగుల్చుకునే కక్కుర్తితోనే పంట నష్టం అంచనాలను జగన్ ప్రభుత్వం తెగ్గోసేసింది. ‘మీకు కొండంత అండగా నేనుంటాను అని ప్రతి రైతన్నకూ హామీ ఇస్తున్నా’’ అని ప్రతిపక్షనేతగా మురిపించిన జగన్- ఎన్నికల ఏరు దాటాక తెప్ప తగలేసి రైతులను నిలువునా ముంచేశారు.
జగనన్న కానుకలంటే ఎండిన చేలే!
నవ్వుతూనే నయవంచనకు పాల్పడటంలో జగన్కు జగనే సాటి. కరెంటు కోతలతో పంటలెండిపోయి గుడ్లనీరు కక్కుకుంటున్న రైతాంగమే అందుకు సాక్ష్యం. ‘‘ప్రతి రైతుకూ పగటి పూటనే 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తాం’’ అని ప్రజాసంకల్ప యాత్రలో జగన్ నమ్మబలికారు. అలా ఇచ్చి వ్యవసాయాన్ని పండగ చేస్తానన్న పెద్దమనిషి- పదవిలోకి వచ్చాక అన్నదాతల కడుపు కొట్టారు. రాష్ట్రంలో చాలాచోట్ల వ్యవసాయానికి ఏడు గంటల పాటే కరెంటు ఇస్తున్నారు. అందులోనూ పగటి పూట ఇచ్చేది మూడు గంటలే. మిగిలింది అర్ధరాత్రి పన్నెండింటి నుంచి నాలుగింటి వరకు వస్తోంది. లోడ్ రిలీఫ్ వంకతో అందులోనూ కోత కోసేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉద్దేహాళ్లో లోకన్న అనే రైతు ఆరెకరాల్లో వరి వేశారు. కరెంట్ అగచాట్ల కారణంగా మూడెకరాల్లో పంటెండి పోయింది. లోకన్న ఒక్కరే కాదు- జగన్ జమానాలో ఇలా కడగండ్ల పాలైన కర్షకులెందరో ఉన్నారు. రోజుకు నాలుగు గంటల పాటైనా సరిగ్గా కరెంటు ఇవ్వట్లేదు, పంటలన్నీ పాడైపోతున్నాయంటూ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన 30 గ్రామాల రైతులు మొన్న ఫిబ్రవరిలో ఆందోళన బాటపట్టారు. నాలుగు రోజులుగా పొలాలకు విద్యుత్తు ఇవ్వట్లేదంటూ అంతకు ముందు పల్నాడు జిల్లా అన్నదాతలు ధర్నాకు దిగారు. అసలే కరవు కాలం.. ఆపై కరెంటు కష్టాలు.. నీటిచెమ్మ తగలక చేలు నెర్రలిస్తున్నాయి. వాటి వంక కన్నెత్తి చూడని వైకాపా అధినేత- ‘‘పగటిపూటే నాణ్యమైన ఉచిత కరెంట్ అంటే మీ బిడ్డ జగన్’’ అంటూ తనను తానే మెచ్చుకుని మేకతోలు కప్పుకొంటున్నారు.
నక్కబుద్ధుల్లో నంబర్ 1
చేసిన పాపం గోచీలో పెట్టుకుని కాశీకి పోయి, హరహరా అన్నాడట వెనకటికొకడు. జగన్ కూడా అంతే.. అధికారంలో ఉన్నన్నాళ్లూ అన్నదాతలకు నమ్మకద్రోహం చేసి ఇప్పుడు ఓట్లకోసం మళ్లీ ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ‘‘రాష్ట్రంలోని రైతులకు మన ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేయిస్తుంది’’ అని ప్రతిపక్షనేతగా రైతన్నలను బులిపించారు జగన్. ‘‘బోర్లు తవ్వించడమే కాదు.. మోటార్లు బిగించి, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తాం. కేసింగ్ పైపులు కూడా ఉచితంగానే అందించబోతున్నాం’’ అంటూ సీఎంగానూ వాగ్దానాల వరద పారించారు. ఆయన మాటలను నమ్మి 2.32 లక్షల మందికి పైగా రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ‘వైఎస్ఆర్ జలకళ’ పథకం కింద బోర్లేయించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తానన్న జగన్- దరఖాస్తుదారులకు ఘోర అన్యాయం చేశారు. మొన్న డిసెంబరు చివరి వారం నాటికి 23,935 బోర్లే తవ్వించారు. వాటిలోనూ కరెంట్ కనెక్షన్ ఇచ్చినవి కేవలం 4,795. పంపు సెట్లు బిగించిన బోర్లు అయితే 836 మాత్రమే! విద్యుత్ కనెక్షన్ ఉచితమని చెప్పి, ఆపై మడమ తిప్పేసిన జగన్ మూలంగా బడుగు రైతులపై రూ.8వేల కోట్ల అదనపు భారం పడింది. తెల్లారి లేచింది మొదలు విశ్వసనీయత వంకాయ కూర అంటూ కబుర్లు చెప్పే జగన్ నిజరూపమిది! తెదేపా హయాంలో ‘ఎన్టీఆర్ జలసిరి’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 33వేలకు పైగా బోర్లు తవ్వి, ఉచితంగా మోటార్లు అందించారు. రాయితీ మీద సోలార్ ప్యానెళ్లనూ సమకూర్చారు. ఆ పథకం పేరుమార్చి, దాని అమలును దిగజార్చి మొత్తం రైతులోకాన్నే ఏమార్చిన నంబర్1 నక్కబుద్ధులు జగన్వి!
‘‘నా చావుకు కారణం.. జగన్’’
‘‘రైతు భరోసా అంటే మీ జగన్.. ఉచిత పంటల బీమా అంటే మీ బిడ్డ జగన్’’ అంటూ వైకాపా అధినేత ఒకపక్క దరువేసుకుంటున్నారు. మరోవైపు.. పంటల బీమా రాలేదని కర్నూలు జిల్లా రైతు సుంకన్న ఆత్మహత్య చేసుకున్నాడు. సాగుకోసం చేసిన అప్పులను తీర్చే తోవ దొరకక అదే జిల్లా పి.చింతకుంటకు చెందిన యువరైతు దంపతులు సంజీవరెడ్డి, శ్రావణి బలవన్మరణాలకు పాల్పడ్డారు. ‘‘స్వయానా ముఖ్యమంత్రి జగన్ నా చావుకు కారణం..’’ అని లేఖ రాసి మరీ సీఎం సొంత జిల్లా తుడుములదిన్నె గ్రామరైతు వెంకట సుబ్బారెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన అన్నదాతలు ఎర్నినాయుడు, లోవరాజులు కూడా అప్పుల బాధలు భరించలేక తనువులు చాలించారు. జగన్ కర్కశ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఎందరో రైతన్నలు ప్రాణాలు తీసుకున్నారు. మొన్న ఫిబ్రవరిలో కూడా జగన్ సొంత జిల్లా పొన్నంపల్లెకు చెందిన రైతు మారెన్న అలాగే కడతేరి పోయాడు. అప్పుల ఊబిలోంచి అన్నదాతలను బయటపడేయని జగన్- ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారాలనూ సరిగ్గా ఇవ్వలేదు. కౌలురైతులనైతే జగన్ మరీ దారుణంగా దగా చేశారు. ఏటా 15.36 లక్షల మందికి రైతుభరోసా ఇస్తామని హామీ ఇచ్చి- వారిలో 93శాతం మందికి మొండిచెయ్యి చూపించారు. పంట నష్టాలు, అప్పుల బరువును తాళలేక కౌలు రోతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే మొద్దునిద్ర పోయారు. ‘‘మాది రైతు పక్షపాత ప్రభుత్వం’’ అంటూనే సాగుదారుల నోట్లో మట్టికొట్టిన మనిషి జగన్మోహన్ రెడ్డి. వినాశకర విధానాలతో అన్నదాతల ఆశల పంటలను దుంపనాశనం చేసిన జగన్- రాష్ట్రానికి పట్టిన అగ్గి తెగులు!
పచ్చిమోసాల్లో దిట్ట.. జగన్!
‘‘రైతు పంట వేయడానికి ముందే వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపించే విధంగా ఆ పంటను ఫలానా రేటుతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటిస్తాం’’ అని ప్రతిపక్షనేతగా అన్నదాతలకు ఆశపెట్టారు జగన్. సీఎం అయ్యాక కూడా అలాంటి ప్రవచనాలనే యమజోరుగా వినిపించారు. ‘‘రైతులు కనీస మద్దతు ధరకంటే తక్కువకు పంటలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఒక్క ధాన్యమే కాదు.. ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటలకూ కనీస మద్దతు ధర లభించేలా అధికారులు సవాల్గా తీసుకుని పనిచేయాలి’’ అని 2022లో జగన్ సెలవిచ్చారు. ‘‘రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని 2023లోనూ ధర్మోపదేశాలు చేశారు. ఇలా ప్రతిఏటా కోసిన కోతలే మళ్లీ మళ్లీ కోశారు తప్ప- గిట్టుబాటు ధరలిచ్చిన పాపాన పోలేదాయన. ఏటా కొన్ని పంటలకు కేంద్రం మద్దతు ధర(ఎంఎస్పీ)లను ప్రకటిస్తుంది. అవి పోను మిగిలిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందే ఎంఎస్పీ ప్రకటించి, ఆ ధరలకే కొంటామన్నది జగన్ వాగ్దానం. కేంద్రం తన జాబితాలోని పంటలకు ఎంఎస్పీలను ఏటా ఎంతోకొంత పెంచుతోంది. సాగుదారులపై దయలేని జగన్ సర్కారేమో 2019-20 నాటి మద్దతు ధరలనే ఇప్పటికీ కొనసాగిస్తోంది. నాలుగేళ్లలో సాగుఖర్చులు అధికమయ్యాయి. రైతులకు అవి మోయలేని భారాలవుతున్నాయి. అయినా జగన్ కరకు గుండె కరగలేదు. మద్దతు ధరలను పెంచలేదు. పెట్టుబడి ఖర్చులు, సాగుదారుల శ్రమ, భూమి విలువను పరిగణనలోకి తీసుకుని ఎంఎస్పీలను ఏటా నిర్ణయించాలి. రైతు జన బాంధవుడిగా పోజులుకొట్టే జగన్ అదేమీ పట్టించుకోలేదు. సకాలంలో పంటల సేకరణకూ పూనుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ పంటలను అయినకాడికి అమ్ముకున్నాక సేకరణ అంటూ హడావుడి చేయడం జగన్కు అలవాటైపోయింది. కిలో అరటికి రూ.8 చొప్పున ఎంఎస్పీ ప్రకటించి, అందులో సగం రేటుకు అదీ అరకొరగా కొనిపించడం వంటి పచ్చి మోసాల్లోనూ జగన్ దిట్ట!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు