నందినీరెడ్డి దర్శకత్వంలో ‘ఏక్ మినీ కథ’ హీరో?
'అలా మొదలైంది', 'ఓ బేబీ'లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ఈ మధ్యే ఓటీటీలో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ హీరో సంతోష్ శోభన్తో ఆమె ఓ సినిమా చేయనున్నారని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు నందినీరెడ్డి. ఈ మధ్యే ఓటీటీలో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ హీరో సంతోష్ శోభన్తో ఆమె ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ‘ఏక్ మినీ కథ’లో సంతోష్ నటన చూసి ఆమె ముగ్ధురాలయ్యిందట. ఇప్పటికే అతనికి కథను కూడా వినిపించిందట. సంతోష్ కూడా కథ పట్ల సానుకూలతను వ్యక్తం చేశాడని చెప్పుకుంటున్నారు. కొవిడ్ -19 పరిస్థితి మెరుగైన వెంటనే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్వప్నా సినిమాస్ నిర్మించనుందట. నందిని ప్రస్తుతం ఆహా వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉంది. ఈ సంవత్సరం చివరలో గీతా ఆర్ట్స్ కోసం ఓ సినిమాకి దర్శకత్వం వహించడానికి ఆమె ఇప్పటికే అంగీకరించింది. మరోవైపు మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్ సీరీస్లో సంతోష్ శోభన్ నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!