Vivaha Bhojanambu Review: రివ్యూ: వివాహ భోజనంబు
Vivaha Bhojanambu Review: సత్య కీలక పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘వివాహ భోజనంబు’ ఎలా ఉందంటే?
చిత్రం: వివాహ భోజనంబు; నటీనటులు: సత్య, సందీప్ కిషన్, ఆర్జవి, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయశర్మ, టీఎన్ఆర్(దివంగత), హర్ష, శివన్నారాయణ, మధుమణి, నిత్యశ్రీ, కిరీటి తదితరులు; సంగీతం: అన్వీ; సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్; ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్; నిర్మాత: కె.ఎస్.శినిష్, సందీప్ కిషన్; రచన: భాను భోగవరపు; దర్శకత్వం: రామ్ అబ్బరాజు; విడుదల: సోనీ లివ్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది హాస్యనటులు మరో ఇండస్ట్రీలో లేరనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ఇప్పటికీ హాస్యనటులకు కొదవలేదు. ఇక హాస్య ప్రధానమైన చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రేటు ఎక్కువే. చక్కని హాస్యంతో, పంచ్లతో సినిమా సాగుతుంటే కాలక్షేపం కోసం రెండు, మూడు సార్లు చూసేవాళ్లూ ఉన్నారు. అలాంటి కామెడీ టైమింగ్తో నవ్వులు పంచే నటుల్లో సత్య ఒకరు. ఆయన కీలక పాత్రలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వివాహ భోజనంబు’. కరోనా కారణంగా సోనీ లివ్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? లాక్డౌన్ కష్టాలతో సాగే ఈ కథలో సత్య అండ్ కో ఎలా మెప్పించారు?
కథేంటంటే: మహేశ్ (సత్య) ఎల్ఐసీ ఏజెంట్. మహా పిసినారి. ప్రతి రూపాయినీ ఒకటికి రెండు సార్లు లెక్కపెట్టుకుంటాడు. డబ్బులు పొదుపు చేయడానికి ఏమైనా చేస్తాడు. అనుకోకుండా అనిత(ఆర్జవి)అనే అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇదే విషయాన్ని అనిత తన కుటుంబ సభ్యులకు చెబుతుంది. అయితే, మహేశ్ వాలకం చూసిన అనిత కుటుంబం అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకొంటుంది. సరిగ్గా మహేశ్ పెళ్లైన రోజు నుంచే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారు. దీంతో పెళ్లికి వచ్చిన అనిత కుటుంబ సభ్యులందరూ మహేశ్ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన మహేశ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బంధువులను పోషించడానికి అతడు పడిన తిప్పలు ఏంటి? చివరకు వాళ్లను ఊరికి పంపాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుపోయి సొంతూళ్లకు వెళ్లలేక అవస్థలు పడిన వారు కొందరైతే.. చుట్టం చూపుగానో, శుభకార్యానికో వచ్చి బంధువుల ఇంట్లో ఇరుక్కుపోయిన వారు ఇంకొందరు. ఇలా బంధువుల ఇంట్లో అదీ ఒక పిసినారి ఇంట్లో పది, పదిహేను మంది ఉంటే, వారి పోషించడానికి అతడు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఇలా గతేడాది కొన్ని కుటుంబాల్లో ఎదురైన ఇలాంటి వాస్తవ పరిస్థితులను కథగా రాసుకున్నాడు భాను భోగవరపు. దానికి తనదైన టైమింగ్తో నవ్వులు పంచేలా ‘వివాహ భోజనంబు’ను తెరకెక్కించడంలో రామ్ అబ్బరాజు విజయం సాధించారు. అనవసర సన్నివేశాలకు జోలికి పోకుండా మహేశ్-అనితల ప్రేమ వ్యవహారాన్ని, పెళ్లిని అమ్మాయి ఇంట్లో చెప్పడం ద్వారా నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ తర్వాత మహేశ్ నిశ్చితార్థం, పెళ్లి ఇలా ఒక్కో సన్నివేశాన్ని నవ్వించేలా తీర్చిదిద్దారు.
లాక్డౌన్ కారణంగా అందరూ మహేశ్ ఇంట్లో ఉండిపోవడం, అక్కడ మహేశ్ పడే ఇబ్బందుల ద్వారా ప్రేక్షకుడికి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కరోనా కాలంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతీ విషయం ద్వారా నవ్వు పుట్టించారు. ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, పసుపు నీళ్లతో స్నానాలు చేయడం ఇలా దేన్నీ వదల్లేదు. అన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. ‘పోరాడాల్సింది రోగితో కాదు.. వ్యాధితో’ అంటూ వచ్చే స్లోగన్ను కూడా కామెడీ కోసం వాడిన విధానం నవ్వులు పంచుతుంది. ఇలా ప్రథమార్ధమంతా నవ్వులతో సాగిపోతుంది. ఇక అనిత కుటుంబాన్ని ఇంటికి తరలిస్తాడా? అన్న విషయాన్ని ద్వితీయార్ధంలో చూపించే ప్రయత్నం చేశారు. అయితే అందుకు అంబులెన్స్ డ్రైవర్ (సందీప్ కిషన్)తో ఒప్పందం చేసుకోవడం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా సందీప్ కిషన్ను తాగుబోతుగా, ‘భ్రమ’లో బతికే వాడిగా చూపించిన విధానం ద్వారా హాస్యం పుట్టించాలనుకున్నాడు దర్శకుడు. అది నవ్వులు పంచకపోగా ఆయా సన్నివేశాలన్నీ అతికించినట్లు అనిపిస్తాయి. ఆ స్థానంలో సప్తగిరి, తాగుబోతు రమేశ్లాంటి నటులను ఎంచుకుంటే సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయ్యేది. పతాక సన్నివేశాలు భావోద్వేగంగా సాగినా అవన్నీ రొటీన్గా చాలా సినిమాల్లో చూసినవే. ఓవరాల్గా ఓ మంచి కామెడీ మూవీ చూసిన ఫీల్ ప్రేక్షకుడికి కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే: పిసినారి మహేశ్ పాత్రలో సత్య నటన చాలా బాగుంది. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టి పిండి. తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పంచారు. అతని స్నేహితుడిగా నటించిన సుదర్శన్, మామగా శ్రీకాంత్ అయ్యంగార్లు సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా శ్రీకాంత్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. శివన్నారాయణ, హర్ష, సుబ్బరాయశర్మ ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు నటించారు. ప్రధాన ఆకర్షణ అనుకున్న సందీప్ కిషన్ పాత్ర సోసోగా ఉంది. సాంకేతికంగా సినిమా బాగుంది. అన్వీ సంగీతం, మణికందన్ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఓకే. చిన్న బడ్జెట్ మూవీ. ఒకట్రెండు ప్రదేశాల్లోనే సినిమా మొత్తం సాగుతుంది. కరోనా కారణంగా గతేడాది ప్రజలు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితులకు హాస్యం జోడించి, భాను భోగవరపు రాసుకున్న కథ చాలా బాగుంది. అయితే, ఇంకొన్ని మెరుపులు జోడించి ఉంటే బాగుండేది. భాను కథను రామ్ అబ్బరాజు చక్కగా తీశారు. ప్రతి సన్నివేశాన్ని నవ్వులు పంచేలా తీర్చిదిద్దారు.
బలాలు
+ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్ల నటన
+ కథ, హాస్య సన్నివేశాలు
+ ప్రథమార్ధం
బలహీనతలు
- సందీప్ కిషన్ ఎపిసోడ్
చివరిగా: ‘వివాహ భోజనంబు’ రుచిగా ఉంది. ఒకట్రెండు కూరలు కాస్త చప్పగా ఉన్నాయంతే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే